Chief Minister Revanth Reddy : ప్రజా దీవెన, భద్రాద్రి కొత్తగూడెం: అఖ్యాత భద్రాచలo పుణ్య క్షేత్రం లో శ్రీరామనవమి వేడుకలు అంగ రంగవైభవంగా కొనసాగాయి. మిథిలా స్టేడియంలోని శిల్పకళాశో భితమైన కల్యాణ మండపంలో ఉ దయం 10.30 గంటలకు తిరుక ల్యాణ మహోత్సవం ప్రారంభo కాగా యావత్ కార్యక్రమం అనం తరం సీతారాముల కల్యాణం కన్ను ల పండువగా జరిగింది. ఈ కల్యా ణాన్ని తిలకించేందుకు చుట్టుప్ర క్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అభిజిత్ లగ్నం లో సీతారాముల కల్యాణం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు తర లి రావడంతో దేవస్థానం అధికారు లు భక్తుల కోసం 2 లక్షల లడ్డూలు, 200 క్వింటాళ్ల తలంబ్రాలను పంపి ణీకి సిద్ధం చేశారు. ఆర్టీసీ ఖమ్మం రీజి యన్ పరిధిలో భద్రాచలానికి 197 ప్రత్యేక బస్సులను నడుపు తోంది. ఇదిలా ఉండగా సోమవా రం నిర్వహించే పట్టాభిషేక మ హోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విచ్చేయనున్నారు. కాగా కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ దంపతులు, డిప్యూటీ సీ ఎం దంపతులు, మంత్రి పొం గులే టి దంపతులు, ముఖ్యనేతలు, స్థా నిక నేతలు, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం చేరుకున్న సీఎం రేవంత్ … భద్రాచలం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంప తులకు రామాలయంలో అర్చకు లు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీతారామ చంద్ర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వా మి అమ్మవార్లకు పట్టు వస్త్రా లు, ముత్యాల తలంబ్రాలు సమర్పిం చారు. అధికారులు మిధిలా స్టేడి యం ప్రాంగణాన్ని 24 సెక్టార్లుగా విభజించారు. శ్రీరాముని కల్యా ణోత్సవాన్ని అందరూ వీక్షించేందు కు అన్ని సెక్టార్లలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కాగా సోమవా రం శ్రీరామ పట్టాభిషేకం జరగనుం ది. వేసవి కావడంతో చలువ పం దిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు మంచినీరు, మజ్జిగ పంపిణీ చేస్తు న్నారు.
లబ్ధిదారుని ఇంటిలో సీఎం భోజనం… కాగా కల్యాణం అనం తరం సీఎం రేవంత్ రెడ్డి బూర్గంపా డు మండలం సారపాకకు చెందిన బూరం శ్రీనివాసరావు అనే సన్నబి య్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సన్న బియ్యం పంపీణిని ప్రతిష్ఠాత్మ కంగా ప్రారంభించిన నేపథ్యంలో సన్న బియ్యం అందుకున్న లబ్ధి దారుల ఇళ్లలో ప్రజాప్రతినిధులు భోజనం చేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించిన విషయం తెలి సిందే. ఈ నేపథ్యంలో ఆదివారం భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కల్యాణానికి విచ్చేసిన సీఎం లబ్ధి దారుడి ఇంట్లో భోజనం చేశారు.
అయోధ్యలో అంగరంగ వైభ వంగా… అయోధ్యలో బాలరా ముని ఆలయ నిర్మాణం తర్వాత రెండో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతు న్నాయి. మార్చి 29 నుంచి వసంత నవరాత్రి వేడుకలు ప్రారంభమ య్యాయి. ఈ మధ్యాహ్నం 12 గం టలకు రాముల వారికి అభిషేకం చేస్తున్నారు. ఈ సందర్భంగా భాను డి సూర్య కిరణాలు బాలరాముడి నుదిటిపై తిలకం దిద్దాయి. సరిగ్గా మధ్యా హ్నం 12 గంటలకు సూర్య కిరణాలు బాల రాముడి నుదిటిపై నాలుగు నిమిషాల పాటు ప్రసరిం చాయి. ఈ అద్భుతాన్ని చూసి భ క్తులందరూ తరించారు. అదే సమ యంలో గర్భాలయంలో లైట్లు ఆ ర్పివేయడంతో సూర్య తిలకం దృ శ్యాలు మరింత శోభాయమానంగా వెలుగొందాయి.
సనాతన ధర్మంలో సూర్యుడిని శక్తి కి మూలంగా భావిస్తారు. సూర్యు డు తన కిరణాలతో రామునికి తిల కం దిద్దడం వల్ల రామునిలోని దైవ త్వం మేల్కొంటుందని విశ్వసిస్తా రు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తు లు అయోధ్యకు తరలి వచ్చారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చే స్తోంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా భక్తులు తమ ఇళ్ల నుంచే ఈ అ ద్భుతాన్ని చూసి తరిస్తున్నారు.
ఇవాళ అయోధ్యకు దాదాపు 20 లక్షల మందికి పైగా భక్తులు వస్తా రని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ పలు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తుల దర్శనా లకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుం డా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ ప్రత్యేక పాస్లను రద్దు చేసింది. ఆలయ ప్రాంగణంలో చ లువ పందిళ్లు, తాగునీటి ఏర్పా ట్లు, తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు, ఏడు చోట్ల 108 అంబులెన్సులను సిద్ధం చేసింది. ఇక, డ్రోన్ల సాయం తో సరయూ నది జలాలను భక్తు లపై జల్లుతుండటం మరో విశేషం