cylinder explosion : ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్ర దేశ్ లోని నంద్యాల మండలంలో తీవ్ర విషాద సంఘటన చోటు చేసు కుంది. ఓ ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెం దారు. మండలంలోని చాపిరే వులలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో నివాస ముంటున్న వెంకటమ్మ అనే మహి ళ ఇంట్లో మంగళవారం వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలింది. ఘటనలో వెంకటమ్మ (62), ఆమె మనవడు దినేష్(9) తీవ్ర గాయా లతో అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన మరో 8 మందిని నం ద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
సిలిండర్ పేలుడు దాటికి ఇంటి పక్కనే ఉన్న రేకుల షెడ్డు కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పిం ది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Gas cylinder blost in andhrapradesh Nandyal pic.twitter.com/h0lx3wy8kK
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) January 28, 2025