Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

National Herald : బిగ్ బ్రేకింగ్, నేషనల్ హెరాల్డ్ కేసు లో ఈడీ దూకుడు, ఆస్థుల జప్తు

National Herald : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచిం ది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆ రోపణలు ఎదుర్కొంటున్న అసో సియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏ జేఎల్)కు చెందిన రూ.700 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసేందు కు చర్యలు ప్రారంభించింది. నేషన ల్ హెరాల్డ్‌ను ప్రచురించే ఏజేఎల్ సంస్థను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఇం దులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు 38 శాతం చొప్పున వాటా ఉంది.

తాజాగా ఢిల్లీ, ముంబై, లక్నో నగ రాల్లో ఉన్న ఏజేఎల్ ఆస్తులను ఈ డీ గుర్తించింది. వాటిని స్వాధీనం చేసుbకునేందుకు ప్రివెన్షన్ ఆఫ్ మ నీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద చర్యలు చేపట్టింది. జప్తు చే యనున్న ఆస్తుల్లో ఢిల్లీలోని హెరా ల్డ్ హౌస్ కూడా ఉంది. గతంలోనే ఈ ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. అయితే, ఇప్పుడు వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకు నేందుకు సిద్ధమైంది.

యంగ్ ఇండియన్ సంస్థ ఏజేఎల్ ఆస్తులను ఉపయోగించి రూ.18 కోట్ల నకిలీ విరాళాలు, రూ.38 కోట్ల నకిలీ అద్దెలు, రూ.29 కోట్ల నకిలీ ప్రకటనల ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించిందని ఈడీ ఆరోపిస్తోం ది. ఈ వ్యవహారంలో మనీలాండ రింగ్ జరిగిందని ఈడీ దాదాపు ని ర్ధారణకు వచ్చింది. అందుకే పీఎం ఎల్ఏ కింద ఆస్తులను జప్తు చేసేం దుకు చర్యలు తీసుకుంటోంది.