Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Road Accident : చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు దుర్మరణం

Road Accident : ప్రజా దీవెన, చిత్తూర్: ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగామరో 14 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.తిరుపతి చెన్నై జాతీయ రహదారి లోని నగ రి ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో నే ఈ ప్రమాదం జరిగింది.

 

తిరుపతి జిల్లా వడమాల పేట మండలం సీతారామ పురం గ్రా మానికి చెందిన వారు తమిళ నాడు రాష్ట్రం తిరుత్తని, పట్ట ణంలో జరిగే వివాహానికి, ప్రైవేట్ ట్రావెల్ బస్సులో వెళ్లి వస్తుండగా నగరి సమీపంలో ముందు వెళు తున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేస్తు న్న సమయంలో ఎదురుగా ఓ లారీ ఢీకొట్టుకుంటూ వెళ్లింది. వేగంగా ఢీకొనడంతో బస్సులో ఒకవైపు కూర్చున్న ప్రయాణికులే ప్రమాదా నికి గురయ్యారు. నలుగురు అక్క డికక్కడే మృతిచెందిగా మరికొద్ది మంది తీవ్రంగా గాయపడ్డారు.

 

 

ప్రమాదంలో వడమాలపేట మండ లం సీతారాంపురం గ్రామానికి చెందిన పార్థ సారథి, రాజేంద్ర నాయుడు తోపాటు తిరుపతికి చెందిన 8 ఏళ్ల మణికంఠ తో పాటు 60 ఏళ్ల వయసున్న మరో వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తమిళనాడుకు చెందిన చిన్నమలై పరిస్థితి విషమంగా ఉండగా క్షతగా త్రులను నగరి ప్రభుత్వా సుపత్రికి తరలిం చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.