SLBC Tunnel : ప్రజా దీవెన, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం మా ర్గంలో జరిగిన ప్రమాదం భయానక సమాచారం వెల్లడిస్తోందని తెలు స్తోంది. ప్రమాదం ప్రారంభం నుంచి అనేక అనుమానాలు తావిచ్చిన సెల్విసి సొరంగ ప్రమాదం గడచిన కాలంలో అనేక ప్రశ్నలను మన ముందుoచిందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు శ్రీశైలం ఎడమ గట్టు కాలువ స్వరంగం మార్గం ప్రమాదంలో చి క్కుకున్న ఆ ఎనిమిది మంది బతికి బట్టకట్టడం అతి కష్టమైన పనిగా స హాయక చర్యల్లో పాల్గొన్న సాంకే తిక నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఎస్ ఎల్ బి సి టన్నెల్లో చిక్కు కున్న కార్మికులపై ఆశలు ఎంత మాత్రం లేవని ఇప్పటికే సన్నగిల్లా యని వాళ్లు బ్రతకడం చాలా కష్ట మన్న అభిప్రాయాన్ని ఓ సాంకేతిక నిపుణుడు బహిరంగంగానే వెల్ల డిస్తున్నాడు. సొరంగం మార్గం లోపల కూలిన మట్టి, రాళ్లను ఎక్కడికక్కడ తొలగించాలంటేనే ఏడాది కాలం పడుతుందని పడు తుందని సదరు నిపుణుడు పేర్కొం టున్నాడు. జరిగిన ప్రమాదం పక్క న పెడితే టన్నెల్ లోపల ప్రమాదం ఇప్పటికీ మరో మారు పొంచి ఉం దని చెబుతున్నారు. లోపలికి వెళ్లే కొద్దీ ప్రమాదం మరింత ఎక్కువ అవుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.టన్నెల్ లోపల మట్టి మళ్ళీ కూలే ప్రమాదం ఉందని, డెహ్రా డూన్లో 41 మందిని కాపా డినం కానీ ఇక్కడ ఆశలు ఎంత మాత్రం లేవని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేమంతా విదిలేని పరిస్థితుల్లో తిరిగి వెళ్ళిపోతున్నా మని ప్రత్యేకంగా ఓ సంస్థకు ఇచ్చిన మౌఖిక ముఖాముఖిలో వెల్లడించారు.
Hopes are fading for those trapped in the SLBC tunnel route, say tech nical experts pic.twitter.com/LF9FM8yy7U
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) February 26, 2025