Phone Tapping Controversy : ప్రజా దీవెన అమరావతి: తెలం గాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ గురించి ఇ ప్పుడు జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎంతోమంది ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల ఫోన్లను బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో ట్యాప్ చేసినట్లుగా ఆరోప ణలు వినిపిస్తున్నాయి. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో సోషల్ మీడియాలో కనిపిస్తున్న జాబితా చూసి అందరూ షాకవుతున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిళ సైతం తన ఫోన్ ట్యాప్ అ యినట్లు సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్, వైసీపీ ప్రభుత్వాల జాయింట్ ఆప రేషన్ కూడా అని ఆమె అన్నారు. తన ఫోన్ ట్యాప్ అయిందనడానికి పక్కా ఆధారాలున్నాయని.. వైసీపీ అగ్ర నేతల్లో ఒకరైన వైవీ సుబ్బారెడ్డి స్వయంగా ట్యాప్ అయిన కాల్కు సంబంధించి తన వాయిస్ను స్వ యంగా వినిపించినట్లు కూడా ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజ కీయ వర్గాల్లో చర్చనీయాంశం కాగా సుబ్బారెడ్డి వెంటనే దీనిపై స్పందిం చారు. షర్మిళ ఆరోపణలు అబద్ధమ ని ఆయన ఖండించారు.
“గత తెలంగాణ ప్రభుత్వం షర్మిల ఫోన్ ట్యాప్ చేసిందని, వాటిని ఇక్క డ ముఖ్యమంత్రికి ఇచ్చారనడం చా లా హాస్యాస్పదంగా ఉంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా, షర్మి ల తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీ యాలు నడిపారు. అప్పుడు జగన్ కి, షర్మిలకి సంబంధాలు ఇలా లేవు. అలాంటి పరిస్థితుల్లో షర్మిల ఫోన్ ను ట్యాప్చేసి కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడి సీఎంకు ఎందుకు ఇస్తుంది? అసలు కేసీఆర్గారి ప్రభుత్వం ట్యా ప్చేసిందా లేదా అన్నది నాకు తెలి యదు. టీడీపీకి సంబంధించిన ఎ ల్లో టీవీల్లో, పత్రికల్లో నాపేరు ప్ర స్తావనకు వచ్చింది కాబట్టి దీనిపై స్పందిస్తున్నాను” అని ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు సుబ్బారెడ్డి.
ఐతే నిన్న ఈ ఆరోపణలు చేసేటపు డే సుబ్బారెడ్డి గురించి షర్మిళ మరో వ్యాఖ్య చేశారు. ఆస్తి పంపకాల వి వాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి అయిన సుబ్బారెడ్డి.. జగన్ కోసం తర్వాత మాట మార్చిన విషయా న్ని ప్రస్తావించి, ఫోన్ ట్యాపింగ్ విష యంలో జరిగిన దానిపై ఇప్పుడొచ్చి నిజాలు మాట్లాడతారని అనుకోవ డం లేదని అన్నారు. ఆమె అన్నట్లే సుబ్బారెడ్డి షర్మిళ వ్యాఖ్యలను ఖం డిస్తూ పోస్టు పెట్టేశారు.