Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TTD Devasthanam : టీటీడీ కీలక నిర్ణయం, ప్రతిసేవపై ఫీడ్‌బ్యాక్,వాట్సాప్ సేవలు

–సేవలు, సౌకర్యాల్లో నూరుశాతం మార్పు కనిపించాలి
–అభివృద్ది పనుల పేరుతోనిధులు ఇష్టారీతిన ఖర్చు పెట్టొద్దు
— రాబోయే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి
–ప్రక్షాళన వందశాతం జరగాల్సిందే ఏ స్ధాయిలోనూ మినహాయింపులు లేవు
–అరవై అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

TTD Devasthanam : ప్రజా దీవెన, అమరావతి: తిరుమ ల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించే సేవలు, సౌకర్యాల్లో 100 శాతం మార్పు కనిపించాలని, భక్తు ల మనోభావాలకు, ఆలయ పవిత్ర తకు పెద్దపీట వేసేలా ప్రతి కార్యక్ర మం, నిర్ణయం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారుల ను ఆదేశించారు. తిరుమల తిరు పతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమగ్రంగా సమీక్ష చేశారు. భక్తులకు అందించే సౌక ర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్య లపై టీటీడీ అధికారులు ప్రజెంటేష న్ ఇచ్చారు. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్‌లో చేప ట్టే చర్యలపై సీఎం సమీక్షించారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైనా సమావేశంలో చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథ సప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్ర త్యేక సమయాలతో పాటు చేపట్టిన చర్యలు, వాటి ఫలితాలపై అధికా రులు నివేదించారు. 9 నెలల కాలం లో శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్ర సాదంలో తీసుకువచ్చిన మార్పుల పై అధికారులు వివరించారు. గ్యా లరీల్లో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు అవకాశం కల్పించే లా మాఢవీధులలో ఏర్పాట్లు, అలి పిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, శ్రీ పద్మావతీ అమ్మవారి దేవాలయం అభివృద్ది ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాల యం అభివృద్ది పనులు వంటి అంశాలపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. తిరుమల ప్రతిష్ట పెం చడం, తిరు మల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం, సులభ మైన, సౌక ర్యవంతమైన సేవలకు సంబంధిం చి సీఎం పలు సూచన లు చేశారు.

అవసరమైన పనులే చేయం డి…ఈ సందర్భంగా సిఎం మాట్లా డుతూ “తిరుమల దేవాలయంలో సేవలు బాగుంటే ప్రభుత్వానికీ మం చి పేరు వస్తుంది. గత ప్రభుత్వానికి నేటికీ ఇప్పటికే మార్పు కనిపించిం ది. అయితే ఆ మార్పు 100 శాతం ఉండాలి. అప్పుడే భక్తుల, ప్రజల అంచనాలను మనం అందుకోగ లం. పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అను గుణంగా టీటీడీని తీర్చిదిద్దాలి. ఏ పనులు అవసరమో ఆ పనులు మాత్రమే చేయాలి. శ్రీవారి డబ్బు లు ఇష్టారీతిన ఖర్చు పెట్టవద్దు మ నం దేవాలయానికి ధర్మకర్తలం, ని మిత్తమాత్రులం మాత్రమే. శ్రీవారికి భక్తులు ఇచ్చే కానుకల సొమ్మును ఇష్టారీతిన ఖర్చుపెట్టే అధికారం ఎవరికీ లేదు. ఏడుకొండల వాడి సొమ్ము ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదు. వంద ల కోట్ల నిధులను అనేక కార్యక్ర మలకు టీటీడీ ఖర్చు చేస్తోంది. దీనిపై ఇంటర్నల్ ఆడిటింగ్ తో పాటు కాగ్ ద్వారా ఆడిట్ జరిపితే మంచిది. భక్తులు ఇచ్చే వితరణ, విరాళాలు ప్రతి రూపాయి సక్రమం గా ఖర్చు అవ్వాల్సిన అవసరం ఉంది. జవాబు దారీతనం ఉండా లని సిఎం స్పష్టం చేశారు.

“టీటీడీలో సమూల ప్రక్షాళన జరపుతాను అని నేను ఎన్నికల ముందు చెప్పాను. చెప్పిన విధం గానే అధికారంలోకి వచ్చిన తరు వాత అనేక మార్పులు జరిగాయి. అయితే ఈ మార్పులు 100 శాతం ఉండాలి. ఎక్కడా పాతవాసనలు, పాత వ్యక్తులు కొనసాగకూడదు. అనుభవజ్ఞల పేరుతో పాతవారిని ఇంకా కొనసాగించ వద్దు. ప్రక్షాళన అనేది 100 శాతం జరగాల్సిందే దీనిలో మినహాయింపులు లేవని సిఎం అధికారులకు సూచించారు.

అలిపిరిలో బేస్ క్యాంప్… సమీక్ష సందర్భంగా టీటీడీ బోర్డు తీసుకున్న పలు నిర్ణయాలను, పలు ప్రతిపాదనలను అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అలి పిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలి పారు. 25 వేల మందికి సౌకర్యవం తంగా ఉండేలా ఈ బేస్ క్యాంప్ ని ర్మాణం చేపడుతున్నట్లు అధికారు లు తెలిపారు. అదే విధంగా 60 అనుబంధ దేవాలయాల అభివృ ద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న విషయాన్ని, రాష్ట్రం వెలుపల ప్రస్తు తం నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆల యాల పురోగతిని వివరించారు. శ్రీవారి సేవకుల విషయంలో కొత్త వారు 90 శాతం మంది ఉంటు న్నారని అధికారులు చెప్పగా, సగం మంది పాతవారిని నియమిం చుకో వడం ద్వారా నాణ్యమైన సేవలు అందించవచ్చని తెలిపారు. తిరు చా నూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రోజుకు 25 వేల మం ది వరకూ భక్తులు వస్తారని అధి కారులు తెలపగా, దీనికి మరింత అభివృద్ది చేయాలని సీఎం సూచిం చారు. బర్డ్ ఆసుపత్రికి డైరెక్టర్ ని యామకం, జేఈవో, సివిఎస్‌వో, ఎస్వీబీసీ చైర్మన్ నియామకాలను త్వరలో చేపడతామని సీఎం చె ప్పారు. టీటీడీ నుంచి 15 రకాల సేవలు వాట్సాప్‌లో అందిస్తామని అధికారులు చెప్పగా వెంటనే వా ట్సాప్ సేవలు ప్రారంభం కావాలని సీఎం సూచించారు.

ప్రతి సేవకు ఆధార్, సెల్ ఫోన్ నెంబర్‌ను లింక్ చేయడం ద్వారా ఎక్కడా అక్రమాలు జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుందని సీఎం చెప్పారు. మరోవైపు పారిశు ధ్య నిర్వహణపైనా దృష్టి పెట్టాలని సిఎం అన్నారు. తిరుమలలో పేరు కుపోయిన చెత్తను తొలగించేం దుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగిచుంకోవాలన్నారు. టీ టీడీ పరిధి మొత్తం 2,675 హెక్టర్ల లో విస్తరించి ఉండగా ఇందులో ప్రస్తుతం 68.14 శాతం పచ్చదనం ఉంది. దీనిని 80 శాతానికి తీసు కువెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

టీటీడీ సేవలపై సంతృప్తి… రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సందర్భాల్లో తిరుమలలో టీటీడీ అందించిన సేవలపై ఫీడ్‌ బ్యాక్ సర్వేలో భక్తుల నుంచి అత్య ధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైం దని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రథసప్తమి రోజున భక్తుల రద్దీ క్రమబద్దీకరణ, అన్నప్ర సాదం, పరిశుభ్రత, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అన్ని అంశా లపై 76 శాతం మంది భక్తులు ఏ ర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని చెప్పగా, మరో 22 శాతం మంది బావున్నట్టు వెల్లడించారు. కేవలం 1 శాతం పర్వాలేదని, 1 శాతం మంది మాత్రమే బాగోలేదని తెలి పారు. వైకుంఠ ఏకాదశి రోజు 74 శాతం మంది భక్తులు ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని చెప్పగా, మరో 22 శాతం మంది బావున్నట్టు వెల్లడించారు. కేవలం 3 శాతం ప ర్వాలేదని, 1 శాతం మంది మాత్ర మే బాగోలేదని తెలిపారు.

మార్చి 9 నుంచి 14 వరకు సాధా రణ రోజుల్లో తిరుమల వచ్చిన భక్తుల నుంచి ఐవీఆర్ఎస్ విధా నంలో చేసిన సర్వేలోనూ అత్యధిక స్థాయి సంతృప్తి వ్యక్తమైంది. క్యూ లైన్ నిర్వహణ, సౌకర్యాలపై 65 శాతం మంది బాగుంది అని చెప్ప గా, 28శాతం పర్వాలేదని, 7 శాతం మంది బాగోలేదని సమాధానం ఇచ్చారు. అలాగే వసతి, శుభ్రత బాగుందని 74 శాతం, పర్వాలేదని 19 శాతం, బాగోలేదని 7 శాతం మంది చెప్పారు. లడ్డు రుచి నాణ్య త బావుందని 77 శాతం, పర్వాలే దని 17 శాతం, బాగోలేదని 6 శా తం మంది చెప్పారు. ఇంకా అన్న దానం, కల్యాణకట్ట, టీటీడీ ఉద్యో గుల ప్రవర్తన, లగేజ్ కలెక్షన్ డెలి వరీ వంటి అంశాలపైనా ఇదే స్థా యిలో అభిప్రాయాలు వెల్లడిం చారు. మొత్తంగా ఐవీఆర్‌ఎస్ సర్వేలో 61 శాతం మంది భక్తులు టీటీడీ సేవలు బావున్నాయని మెచ్చుకున్నారు. 27 శాతం పర్వాలేదన్నారు. 12 శాతం మంది భక్తులు బాగోలేదన్నారు.

టీటీడీ అనుబంధ ఆలయాల అభివృద్ధి… అమరావతి రాజ ధానిలోని వెంకటపాలెంలో నిర్మిం చిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థా నాన్ని మరింత అభివృద్ధి చేయను న్నారు. చుట్టూ ప్రాకారం నిర్మాణం తో పాటు ఒక రాజగోపురం, మూ డు గోపురాలు నిర్మించనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే టెం డర్లు పిలుస్తారు. అలాగే ఒంటి మిట్ట శ్రీ కోదండరామస్వామి ఆల యాన్ని విస్తరణ పనులతో పాటు సుందరంగా తీర్చిదిద్దనున్నారు. కరీంనగర్, కొడంగల్, నవీ ముంబై, బాంద్రా, ఉలుందుర్పేట, కొయంబ త్తూరులో చేపట్టిన శ్రీవారి ఆలయా ల నిర్మాణం-అభివృద్ధి కార్యక్రమా లపైనా ముఖ్యమంత్రి సమీ క్షించా రు.

ఈ సమీక్షలో దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నా యుడు, ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, జే ఈ వో వీరబ్రహ్మం ,చీఫ్ విజి లెన్స్ అధికారి, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.