Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Unauthorised constructions in Telangana : తెలంగాణలో అనుమతి లేని ప్రాజెక్ట్‌లెన్నో

–తెలంగాణ వాడుకోగా మిగిలినవి మాత్రమే కదా ఏపీ వాడుకునేది
–బనకచర్లపై ఏపీ కూడా వాదనలు వినిపించాలని నిర్ణయం
–సున్నితమైన ప్రాజెక్ట్‌పై నేతలు పూ ర్తి అవగాహనతో మాట్లాడాలి
— రెవెన్యూ సమస్యలను ఏడాది లోపు పరిష్కరించాలి
–గుజరాత్‌ మాదిరిగా బిల్డింగ్ రూ ల్స్‌ను సరళతరం చేయాలి
–అమరావతిలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకి వెంటనే ప్లాన్ చేయాలి
–ఇంకా పలు అంశాలపై చర్చించి ఆమోదించిన ఏపీ మంత్రివర్గం

Unauthorised constructions in Telangana : ప్రజా దీవెన, అమరావతి: ఆంద్రప్ర దేశ్ రాజధాని అమరావతిలో మరో 44వేల ఎకరాల సేకరణకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. స్వ ర్ణాంధ్ర P4పై త్వరలో కమిటీలు ఏ ర్పాటు చేయడానికి నిర్ణయం తీసు కుంది. టెన్నిస్ ప్లేయర్ సాకేత్‌కు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని కేబి నెట్ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో పోలవరం బనకచర్లపై తెలంగాణ నేతలు అందరూ మాట్లా డుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తూ తెలంగాణ కేబినెట్‌లో బనకచర్లపై వాళ్లు చర్చ చేశారని, ఏపీ కూడా మన వాదనలు వినిపించాలని సీ ఎం చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నా రాచంద్రబాబు నాయుడు అధ్యక్ష తన కేబినెట్‌ భేటీ మంగళవారం ఏపీ సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై సీఎం చంద్ర బాబు మంత్రి మండలితో చ ర్చించి పలు అంశాలపై చర్చించిన తర్వాత మంత్రివర్గం ఆమోదం తెలి పింది.

మున్సిపల్ శాఖ ప్రతిపాదనలకు కే బినెట్ ఆమోదం తెలిపింది. రాజధా ని రెండో విడత భూసేకరణను ఆ మోదించింది. తెలంగాణ వాళ్లు అ నుమతి లేని ప్రాజెక్ట్‌లను కూడా క డుతున్నారని సీఎం చంద్రబాబు గు ర్తుచేశారు. ఇంకా చాలా ప్రాజెక్ట్‌లను వాళ్లు కడుతున్నారని తెలిపారు. తె లంగాణ వాడుకోగా మిగిలిన నీళ్ల ను మాత్రమే కదా ఏపీ వాడుకునేద ని సీఎం చంద్రబాబు స్పష్టం చేశా రు. తెలంగాణ నేతలు బనకచర్లపై రాజకీయం చేస్తున్నారని విమర్శిం చారు. వరద జలాలను మనం వా డుకుంటామని, ఈ విషయాన్ని ప్ర జలకు అర్థమయ్యే రీతిలో కూటమి నేతలు చెప్పాలని ఆదేశించారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్ట్‌పై మ నం దశల వారిగా ముందుకు వెళ్తా మని సూచించారు. ఆ తర్వాత కేం ద్రప్రభుత్వం ఏం చెబుతుందో దాని ఆధారంగా మనం నిర్ణయం తీసు కుందామని వివరించారు. ఈ ప్రాజె క్ట్‌లు ఎప్పుడూ శంకుస్థాపన చేస్తా మనేది త్వరగా నిర్ణయించాలని మంత్రి లోకేష్ అన్నారు. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్‌కి అవసరమైతే కేంద్ర ప్రభుత్వ జోక్యం కూడా అవసరమని సీఎం చంద్రబా బు తెలిపారు. ఈ విషయం అర్ధ మయ్యేలా చెప్పేందుకు అవసరమై తే కేంద్రం ద్వారా ఓ సమావేశం ఏ ర్పాటు చేద్దామని చెప్పారు. సున్ని తమైన పోలవరం-బనకచర్ల అను సంధాన ప్రాజెక్ట్‌పై నేతలు పూర్తి అవగాహనతో జాగ్రత్తగా మాట్లాడా లని దిశానిర్దేశం చేశారు.

ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అన్నక్యాంటీన్ లు… రెవెన్యూ సమస్యలను ఏడాదిలోపు పరి ష్కరించాలని సీఎం చంద్రబాబు ఆ దేశించారు. ఎక్కువగా రెవెన్యూ సంబంధిత సమస్యలు వస్తున్నా యని చెప్పుకొచ్చారు. అన్నక్యాంటీ న్లను ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. అన్న క్యాంటీన్లను మానిటర్ చేయ డానికి, ఎవరైనా విరాళాలు ఇస్తే తీ సుకోవడానికి ఒక కమిటీని వేయా లని చంద్రబాబు సూచించారు. అన కాపల్లిలో ఆర్సెల్ మిట్టల్ స్టీల్‌కు సె ప్టెంబర్‌లో శంకుస్థాపన చేసే విధం గా చూడాలని సీఎం చంద్రబాబు ఆ దేశించారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని చెప్పుకొ చ్చారు. జాతీయ స్థాయిలో కొన్ని పంటలకు డిమాండ్ లేకపోవడంతో మనం మార్కెట్‌లోనే కొంటున్నామ ని స్పష్టం చేశారు. పొగాకుకు మా ర్కెట్‌లో ధర తక్కువగా ఉండటం తో రూ. 250 కోట్లు కేటాయించామ ని అన్నారు. పొగాకును మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.

ధరల స్థిరీకరణ నిధి ద్వారా రై తులకు అండగా.. పొగాకు, మా మిడి, కోకో పంటల రైతులను ఆదు కుంటున్నామని ధరల స్థిరీకరణ ని ధి ద్వారా పొగాకు, మామిడి, కోకో పంటల రైతులను ఆదుకుంటున్నా మని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తేమ శాతం ఎక్కువ ఉం దనే కారణంతో పోగాకుకు మార్కె ట్‌లో డిమాండ్ తక్కువ ఉన్నా మ నం చొరవ తీసుకుని రైతులను ఆ దుకుంటున్నామని అన్నారు. చేసిన మంచిని చెప్పుకోవటంలో మంత్రు లు, ఎమ్మెల్యేలు ఎందుకు విఫలమ వుతున్నారని ప్రశ్నించారు. రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని వివరిస్తూనే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతును ప్రోత్సహించాలని సూచించారు. డిమాండ్‌కు తగ్గట్లు గా వాణిజ్య పంటలు వేసేలా రైతు లను చైతన్య పరచాలని అన్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా పొగా కును ఇంత పెద్దమొత్తంలో కొను గోలు చేయటం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని ముఖ్యమంత్రి చంద్రబా బు ఉద్ఘాటించారు. వాణిజ్య పంట లని కొనుగోలు చేసింది కూడా ఏపీ నేనని గుర్తుచేశారు. ప్రజలకు ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పుకో లేక పోతున్నామని నేతలను అడి గారు. అమరావతిలో వివిధ కార్య క్రమాల నిర్వహణకు ప్రభుత్వ పరం గా కన్వెన్షన్ కేంద్రం ఏర్పాటు చేయా లని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో 6497 మినీ అంగన్‌వాడీ కేంద్రాల ను అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌ గ్రేడ్ చేస్తామని అన్నారు. టెంపుల్ టూరిజంతో పాటు ఏపీలో పర్యా టక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సా రించాలని సూచించారు. మచిలీ పట్నం బీచ్ ఫెస్టివల్ సక్సెస్‌పై నేత లను సీఎం చంద్రబాబు ప్రశంసించా రు. ఈ తరహా కార్యక్రమాలు పెద్డఎ త్తున నిర్వహిస్తూ రాష్ట్రంలో పర్యా టకాభివృద్ధికి కృషి చేయాలని సూ చించారు.

ఆరేళ్ల అనుభవదారులకే నష్టప రిహారం… సీఆర్డీఏ పరిధిలో కొత్త గా తీసుకునే భూముల్లో ప్రభుత్వా నికి సంబంధించి 2019కు ముందు ఆరేళ్ల అనుభవదారు ఎవరు ఉం టారో వారికే నష్టపరిహారం ఇవ్వా లని సీఎం చంద్రబాబు సూచించా రు. జిల్లా స్థాయిలో ఏడాది పాలన పై జిల్లా ఇన్‌చార్జి మంత్రి సమావేశం పెట్టాలని కోరారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ఏడాది పాల నపై సమావేశాలు ఏర్పాటు చేయా లని సూచించారు. ఈ సమావేశా ల్లో ప్రభుత్వ పథకాల గురించి ప్రజ లకు వివరించాలని చెప్పారు. ఈ నెలాఖరులోపు ఈ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదే శించారు. జులై 1వ తేదీ నుంచి ఏ డాది పాలనపై ఎమ్మెల్యేలు ఇంటిం టికీ తిరిగి వివరించాలని నిర్దేశించా రు సీఎం చంద్రబాబు. కూటమిలోని అన్ని పార్టీల నేతలను కలుపుకొని ముందుకు వెళ్లాలని కోరారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్లు రాజ ధానిలో లా యూనివర్సిటీ ఏర్పా టు చేయడానికి సంబంధిత భూమి వాళ్లకు లీజ్‌కు ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.

బిల్డింగ్ రూల్స్‌ను మరింత సర ళతరం బిల్డింగ్ రూల్స్‌ను మరిం త సరళతరం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గుజరాత్‌లో మాది రిగా బిల్డింగ్ రూల్స్‌ను సరళతరం చేయాలని సీఎం చంద్రబాబు ఆదే శాలు జారీ చేశారు. రాజధాని అమ రావతిలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పా టుకి వెంటనే ప్లాన్ చేయాలని ము ఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించా రు.