–చిరంజీవిని కలిసిన కేంద్ర మంత్రి బండి సంజయ్
–సాగర స్వాగతం పలుకుతూ ఆప్యాయంగా ఆహ్వానo
–కష్టపడే నాయకుడు సంజయ్ కు తగిన పదవి లభించిందన్న చిరు
ప్రజా దీవెన, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) పద్మభూషణ్, మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi) కలిశారు. ఆదివారం సాయంత్రం జూబ్లిహిల్స్ (Jubilee Hills) లోని ఆయన నివాసానికి చేరుకున్న బండి సంజయ్ ను చిరంజీవి (Chiranjeevi) సాదరంగా ఆహ్వానించి తన నివాసానికి తోడ్కోని వెళ్లారు. శాలువా కప్పి సత్కరించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. సంజయ్ మీరు ఎంతో కష్టపడి పైకొచ్చారు. మీరు మంత్రి కావడం చాలా ఆనం దంగా ఉంది.
మీ అగ్రెసివ్ మెంటా లిటికి తగిన పోస్ట్ లభించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ (pm modi) తమను దగ్గరకు తీసుకుని పలకరించడం మర్చిపోలేని అనుభూతిగా మిగి లిందని ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ స్పందిస్తూ ‘నేను విద్యార్ధి దశలో మీ సినిమాలకు అభిమా నిని’’అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జన సేన కూ టమి మంచి ఫలితాలను ఇచ్చిం దన్నారు. ప్రజలకు మంచి పాలన అందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఇరువురు దేశ, రాష్ట్ర రాజకీయాలపై కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.