Etala Rajender: ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యా ఖ్యలు..మూసీ ప్రక్షాళనకు వ్యతిరే కం కాదు,పద్ధతికి వ్యతిరేకమన్నా రు
Etala Rajender: ప్రజా దీవెన, హైదరాబాద్: మల్కాజ్ గిరి పరిధిలోని ఫతే నగర్ డివిజన్ లో బ్రేక్ ఫాస్ట్ మీటిం గ్ కు మల్కాజిగిరి పార్ల మెంటు సభ్యు లు ఈటల రాజేందర్ Etala Rajender) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను గెలిపించి నాలుగు నెలలు దా టింది. ఈ నాలుగు నెలల కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు తప్ప ప్రతిరోజు మల్కాజ్గిరి నియోజకవర్గంలోనే తిరుగుతున్నాను. ఎంత తిరిగినా ఒడవని నియోజకవర్గం ఇది,ఎంత విన్నా ఒడవని గాధ ఉంది ఇక్కడ.
కలెక్టర్ ను,హెచ్ఎండిఏ కమిషనర్ ను, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎం డిని Collector, HMDA Commissioner, Water Works Department M)ఎమ్మెల్యేలు అందరితో కలిసి కలిశాము. ఇక్కడికి వెళ్ళినా డబ్బు లు లేవంటున్నారు. కేంద్రంలో అర్బ న్ డెవలప్మెంట్ మంత్రిని కూడా కలిశాను. స్వచ్ఛ భారత్, స్మార్ట్ సిటీ కింద డబ్బులు ఇవ్వమని కోరాను. చెరువుల్లోకి మురుగునీ టిని పోకుండా దారి మల్లించేం దుకు గతంలో “స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమం” (Strategic Nala Development Programme) తీసు కువచ్చింది. దానికి కొన్ని నిధులు కేటాయించాలని కోరాను.హైడ్రా ఉద్దేశ్యం వేరే ఉందని నేను చెప్పిన మాటలు ఇప్పటికి ప్రజలు నమ్ము తున్నారు. మూసీ ప్రక్షాళన తరు వాత ముందు మురికినీళ్లను శుద్ధి చేయండి. రసాయన వ్యర్థాలను శుద్ధి చేస్తేనే మూసీ బాగుపడు తుంది. మేము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, చేస్తున్న పద్ధతికి మాత్రమే వ్యతిరేకమని వ్యాఖ్యా నించారు. ప్రజల సమస్యల మీద నేను కొట్లడుతున్నాను. మీ సహ కారం లేనిది అది పూర్తికావన్నారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్ మహేందర్, కూకట్పల్లి బీజేపీ ఇంచార్జీ కాంతరావు, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు, రామ్మోహన్ రావు, కృష్ణగౌడ్, నాగిరెడ్డి, బిక్షపతి శ్రీకర రావు ఐలన్న విజయ్ కుమార్, కృష్ణయ్య, వేణు, శ్రీనివాసరెడ్డి, మాణిక్ రెడ్డి పాల్గొన్నారు.