Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

జగిత్యాల కలెక్టరేట్ ఎదుట గిరిజనుల ధర్నా

జగిత్యాల కలెక్టరేట్ ఎదుట గిరిజనుల ధర్నా

ప్రజా దీవెన / జగిత్యాల :పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలంలోని గిరిజనులు సోమవారం జగిత్యాల కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. పోడు భూములకు పట్టా ఇస్తామన్న హామీతో దరఖాస్తు చేశామని అయితే, కొంత మందికే పోడు భూములు పట్టాలు ఇచ్చి అర్హులైన తమకు పట్టాలు ఇవ్వలేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

25 ఏళ్లుగా ఉన్న అనుభవదారులకు పట్టాలు ఇస్తామన్నారని తాము 30ఏళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటూ జీవన ఉపాధిగా బ్రతుకు వెళ్లదీస్తున్నామని వాపోయారు. అప్పట్లో గిరిజనల్లో చాలామంది నిరక్షరాస్యులు ఉండడం మూలంగా తమ వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. పోడు భూముల విషయంలో మరొకసారి విచారణ జరిపి అర్హులైన వారికి పట్టాలు అందజేయాలని వినతిపత్రంలో కోరారు……….