Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahatma Gandhi University: ఎంజియు -వాణిజ్య విభాగ అధిపతిగా డా సాబీనా హెరాల్డ్

ప్రజాదీవెన, నల్గొండ : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వాణిజ్య విభాగ అధిపతిగా డా సబీనా హెరాల్డ్ నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. డా సబీనా హెరాల్డ్ గతంలో ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్గా, ఎంటర్ప్రేన్యుర్ సెల్ డైరెక్టర్ గా, ఎక్కడ మీకు ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్గా సేవలందించారు. 25 ఏళ్ల బోధన , పరిశోధనలో విశేష అనుభవం , మార్కెటింగ్ మరియు మానవ వనరుల అభివృద్ధి మరియు స్టాటస్టిక్స్ లో జాతీయస్థాయి ఉపన్యాసకులుగా పేరు గడించారు. డా సబీనా హెరాల్డ్ నియామకం పట్ల ప్రిన్సిపాల్ డా వెంకటరమణారెడ్డి, అధ్యాపకులు డా మిరియాల రమేష్, ఆచార్య సరిత, డా శ్రీలక్ష్మి డా సురేష్ రెడ్డి, డా శ్వేత విద్యార్థులు అభినందనలు తెలిపారు.