–తెలంగాణలోని ఖనిజ గనులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి
–తెలంగాణలోని గనులు వెంటనే వేలం వేయండి
–తక్కువలో తక్కువ ఆరు బ్లాకుల కైనా వేలం నిర్వహించండి
–తొమ్మిదేళ్లుగా ఏ ఒక్క బ్లాక్ కూ వేలం వేయకపోవడంపై అసంతృప్తి
–తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ లేఖ
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలంగాణ లోని ఖనిజ గనులపై (Mineral mines) కేంద్ర ప్రభు త్వం (CENTRAL GOVERNMENT) దృష్టి సారించింది. రాష్ట్రంలోని ఖనిజ గనులకు ఈ నెల 30 వ తేదీ లోపు వేలం వేయాలని రాష్ట్ర ప్రభు త్వానికి కేంద్ర గనుల మంత్రిత్వ శా ఖ సూచించింది. గడిచిన తొమ్మిదేళ్ల లో ఏ ఒక్క మినరల్ (MINARAL) బ్లాకు కూడా తెలంగాణ ప్రభుత్వం (TELANGANA GOVERMMENT) వేలం నిర్వ హించని విషయాన్ని గుర్తుచేస్తూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెలా ఖరులోగా కనీసం ఆరు బ్లాకులకైనా వేలం నిర్వహించాలని, లేదంటే తామే ఆ ప్రక్రియను పూర్తిచేయాల్సి వస్తుందని తెలిపింది. కాగా ఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ఆధ్వర్వంలో సంబంధిత అధికారులతో కీలక సమావేశం జరి గింది.
ఈ సమావేశంలో తెలంగాణ లోని గనులపై (MINES) చర్చించినట్టు తెలి సింది. సుదీర్ఘ కాలంగా తెలంగాణ లోని మైనింగ్ బ్లాక్లను వేలం వేయక పోవడం, దీనికి సంబంధించిన కార ణాలు, అడ్డంకులు, గత ప్రభుత్వా ల తీరు తదితర అంశాలపై సమా వేశంలో కూలంకషంగా చర్చించి నట్టు విశ్వనీయ వర్గాల సమాచా రం. ఈ అంశంపైరాష్ట్ర ప్రభుత్వా నికి పలుమార్లు లేఖలు రాసినా స్పందించలేదని అధికారులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలి సింది. ఈ నేపథ్యంలోనే తాజాగా గనుల వేలంపై రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి కేంద్రం లేఖ రాసినట్లు సమాచారం. తెలంగాణలోని (TELANGANA) మొత్తం 11 బ్లాకుల జియలాజికల్ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పంపినట్టు తెలిసింది. ఇం దులో ఐదు ఇనుప ఖనిజం బ్లాక్ లు, ఐదు సున్నపురాయి బ్లాక్ లు, ఒక మాంగనీస్ బ్లాక్ ఉన్నాయి. ఈ 11 బ్లాకుల్లో కనీసం ఆరు బ్లాకు లను ఈ నెల చివరి నాటికి వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం తన లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. అయితే, ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఈ వేలం ప్రక్రియను తామే నిర్వహిస్తా మని కేంద్రం స్పష్టం చేసినట్టు తెలి సింది. మినరల్ బ్లాకుల వేలం ప్రక్రి య 2015లో ప్రారంభమైంది.
అయి తే 2021లో నిబంధనలను సవరిం చగా వీటి ప్రకారం గనులను నిర్దిష్ట గడువులోగా వేలం వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే, ఆ బ్లాకులను విక్రయించే అధికారం కేంద్రానికి సంక్రమిస్తుంది.మైనింగ్ యాక్ట్ (వేలం విధానం) అమలులో కి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తం గా ఇప్పటివరకు 354 ప్రధానమైన ఖనిజ బ్లాకులను (Mineral mines) వేలం వేశారు. ఇం దులో 48 మినరల్ బ్లాక్లలో ఉత్పత్తి ప్రారంభమైందని, ఈ వేలం ప్రక్రియ తో రాష్ట్రాల ఆదాయం గణనీయం గా పెరిగిందని కేంద్ర వర్గాలు తెలిపా యి. అయితే ఈ బ్లాక్ ల వేలానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన విధానాలు సరిగా లేవన్న ఉద్దేశం తోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేలం నిర్వహించలేదని తెలుస్తోం ది. కాగా, తెలంగాణాలో మేజ ర్, మైనర్ మినరల్ బ్లాకులను వేలం పద్ధతిలో తామే కేటాయించాలని కేంద్ర గనుల శాఖ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకే ఖనిజాల వారీగా ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు, ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి (REVANTH REDDY) ఆమోదం రాగానే వేలం ప్రక్రియను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేలంలో అర్హత సాధించిన వారికి ఆయా గనులను 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వనున్నట్లు సమాచారం.