–నల్లగొండ లో విద్యాసంస్థల బంద్ విజయవంతం
NEET:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మే 5 న ఎంబీబీఎస్,ఇతర వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిం చిన నీట్-యూజీ 2024 (NEET-UG 2024)ఎంట్రన్స్ లో జరిగిన పేపర్ లీకేజీ (Paper leakage) ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో (Sitting Judge) న్యాయ విచారణ జరిపిం చాల ని,అక్రమాలకు పాల్పడిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) శాశ్వ తంగా రద్దు చేయాలని, జాతీ య స్థాయి పరీక్ష విధానాన్ని రద్దు చేసి,రాష్ట్రాల పరి ధిలోనే నిర్వ హించాలని డి మాండ్ చేస్తూ గురువారం అఖిల భారత విద్యాసంస్థల బంద్ పిలు పులో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆయా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు.పట్టణంలోని కేజీ టూ పీజీ విద్యా సంస్థలు స్వచ్చం దంగా బంద్ పాటించాయి.
ఈ సందర్భంగా ఆయా సంఘాల బాద్యులు ఇందూరు సాగర్,మల్లం మహేష్,కమ్మంపాటి శంకర్,బరిగెల వెంకటేష్,ముదిగొండ మురళి కృష్ణ,తరుణోజు సాయి తేజ లు పాల్గొని మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం (BJP Govt) పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుందని అన్నారు. నీట్ పేపర్స్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ ప్రజా ప్రతి నిధుల హస్తం ఉన్నదని అందుకే విచారణ చేయడానికి వెనక డుతుం దని అన్నారు.బీజేపీ పాలిత రాష్ట్రా లో బిహార్,యూపీ, గుజరాత్ లో రూ.34 లక్షలకు నీట్ ప్రశ్నపత్రాలు విక్రయించారని,ఈ వ్యవహారంలో అరెస్టులు జరుగు తున్నాయని వార్తలు వస్తు న్నప్ప టికీ ప్రధాని నరేంద్ర మోడీ (modi)ప్రభుత్వం నిమ్మ కు నీరెత్తిన ట్లు వ్యవహరించడం దారుణమని బీజేపీ మోడీ ప్రభు త్వం (modi govt) పై వారు మండి పడ్డారు.నిట్ పరీక్ష ఫలితాలలో 67 మందికి మొదటి ర్యాంకు ఎలా వచ్చిందని, నీట్ పరీక్షలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 67 మందికి మొదటి ర్యాంకులు రావడం ఎన్నో అనుమానాలకు తావిస్తుందని స్పష్టంగా అర్థం అవుతున్నదని అన్నారు.
ఒకే సెంటర్ నుంచి పరీక్ష రాసిన 8 మంది విద్యార్థులకు 720 మార్కు లు రావడం చూస్తే.బీజేపీ హయాం (BJP rule) లో పేపర్ లీకేజీ వ్యవహా రం ఏ స్థాయిలో జరిగిందో స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా అర్థమ యితు న్నదని అన్నారు. ఫలితాల ను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించడం కూడా అనేక సందేహాలకు తావిచ్చింద న్నారు.ఇప్పటికైనా నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్ టి ఏ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి (Pradeep Kumar Joshi)రాజీ నామా చేయాలని అన్నారు. మానిటరింగ్ చేయడంలో విఫలం చెందిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు, విద్యార్థులు సమాధానం సమాధా నం చెప్పాలన్నారు.మళ్ళీ నీట్ పరిక్ష నిర్వహిం చాలని,దోసుల పై క్రిమినల్ కేసులు (Criminal cases)నమోదు చేసి అరెస్ట్ చేయాలని అన్నారు. ఆవులను అన్యాయం జరిగితే రోడ్లమీదికొచ్చి గగ్గోలు పెట్టె మతోన్మాదులు 24ల క్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించి నీట్ పేపర్ లీకేజీ అవుతే ఎందుకు స్పందిం చడం లేదని ప్రశ్నించారు. కేంద్రం ప్రభుత్వన్ని నీట్ నిర్వహ ణంలో వివాదాలు నిత్యం జరుగు తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు,విద్యార్థులు కోరుతున్నట్లు నీట్ ఎగ్జాం ను రాష్ట్రాల పరిధిలోకి మార్చాలని కోచింగ్ సెంటర్లు పేరుతో, కన్సల్టెన్సీ ల పేరుతో పెపర్ లికేజీలు చేస్తున్న నీట్ కోచింగ్ సెంటర్ల అమనుమ తులు రద్దు చేసి పేపర్ లీకేజీ కి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయా లన్నారు. నీట్ రాసిన విద్యార్థు లకు న్యాయం చేయాలని , విద్యా ర్థులకు,దేశ ప్రజలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి చారి, పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి పోలె పవన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు గాదేపాక సూర్యతేజ, ఎస్ ఎఫ్ ఐ జిల్లా నాయకులు కమ్మoపాటి సాయి,తరుణ్, ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ పులుసు నాగార్జున, శరత్,గురువేం దర్,శ్రీకాంత్, కళ్యాణ్,,పోలె వెంకట్, నవదీప్, కామల్ల సందీప్,రావన్ తదితరులు పాల్గొన్నారు.