–ఆర్వో ప్రశ్నాపత్రం లీకులో మరో ఆరుగురు అరెస్ట్
–నీట్ ప్రధాన నిందితుడు రవికి సై తం అందజేత
Neet leakage: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: నీట్ పరీక్ష (Neet leakage) ప్రశ్నాపత్రం లీకేజీ లో దేశంలో రాజ కీయ రగడ కొనసాగుతున్న విష యం తెలిసిందే. ఓవైపు నీట్, నెట్ ప్రశ్నపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా రగడ జరుగుతుండగానే, మరోవైపు యూపీలో రివ్యూ ఆఫీసర్, అసి స్టెంట్ రివ్యూ ఆఫీసర్ (Review Officer, Assistant Review Officer) పరీక్ష పేపర్ లీకేజీ దర్యాప్తులో ఆసక్తికర, విస్మ యకర విషయాలు వెలుగు చూస్తు న్నాయి. ఫిబ్రవరి 11వ తేదీన ఉత్త రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వ హించిన ఈ నియామక పరీక్షకు పది లక్షలమందిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, లీకేజీ ఆరోపణలతో ప్రభుత్వం మార్చి 2న రద్దు చేసింది. ఆపై టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసి విచారణ జరిపింది. ఈ బృందం ఆదివారం యూపీలోని ప్రయాగ్రాజ్కు చెందిన విశాల్ దూ బె, సందీప్ పాండేతో పాటు వివేక్ ఉపాధ్యాయ్, అమర్జీత్ శర్మ, సుభా ష్ ప్రకాష్, సునీల్ రఘువంశీ లను అరెస్టు చూపించింది. వీరిలో సునీల్ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తుంటాడు. గతంలోనే ఈ కేసులో ప్రధాన నింది తుడు రాజీవ్ నారాయణ్ (Rajeev Narayan)సహా 10 మందిని అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా రెండు మార్గాల్లో పేపర్ లీక్ అయిందని తేలిందని పోలీసు లు తెలిపారు.
ఫిబ్రవరి 11న ఉద యం 6.30 సమయంలో ప్రయాగ్రా జ్లోని బిషన్ జాన్సన్ బాలికల పాఠశాల, కళాశాల సెంటర్లో పరీక్ష బాధ్యతల్లో ఉన్న కమలేష్కుమార్ పాల్ అలియాస్ కేకే, డాక్టర్ శరద్ సింగ్ పటేల్, సౌరభ్ శుక్లా, అరుణ్ సింగ్, అర్పిత్ వినీత్ యశ్వంత్లు తమ ఫోన్ల (phone) ద్వారా పేపర్ను స్కాన్ చేశారు. కొందరు అభ్యర్థులకు పం పారు. దీనికిముందే ఫిబ్రవరి 3న సునీల్ రఘువంశీ తాను పని చేస్తు న్న ప్రింటింగ్ ప్రెస్ (Printing press) నుంచి పేపర్ను బయటకు తీసుకొచ్చి విశాల్ దూబె కు సమాచారం ఇచ్చాడు. దూబె రాజీవ్ నయన్ మిశ్రా అలియాస్ రాహుల్, సుభాష్ ప్రకాష్కు విష యం చేరవేశాడు. అనంతరం రాజీ వ్ నయన్ గ్యాంగ్ ఒక్కో పేపర్కు రూ.12 లక్షల ధర నిర్ణయించింది. కాగా, మధ్యప్రదేశ్ రాజధాని భోపా ల్కు 950 కి.మీ. దూరంలోని ప్రింటింగ్ ప్రెస్లో ఆర్వో పేపర్ ముద్రణ అవుతున్నట్లు తెలిసిన రాజీవ్ విశాల్ దూబెతో కలిసి పథకం వేశాడు. సునీల్, విశాల్ గతంలో సహధ్యాయులు కూడా. మరోవైపు కన్సల్టెంట్గా పనిచేసే విశాల్, సుభాష్తో కలిసి విద్యార్థు లను ఇంజనీరింగ్ కళాశాల్లో (engineering college) చేర్చే వాడు. దీంతో ఈ నలుగురూ కలిసి పథకం పన్నారు. ప్రశ్నపత్రం చేతికి దొరికాక సునీల్ ఇతరులకు సమా చారం ఇచ్చాడు. వివేక్, బిహార్కు చెందిన అమర్జీత్లు ఆర్వో, అసిస్టెం ట్ ఆర్వో పరీక్షలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులను గుర్తించి వారి నుంచి రూ.12 లక్షలు వసూలు చేశారు. కాగా, రాజీవ్ నారాయణ్ నీట్ పే పర్ లీకేజీ ప్రధాన సూత్రధారి రవి అత్రికి కూడా ఫోన్ ద్వారా చేరవే శాడు. అతడు ఇంకొందరికి వాటిని పంపడంతో సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం.