–రైతన్నకు కొత్త సంవత్సరం మోదీ విసెస్
–దేశవ్యాప్తంగా మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణంపై సర్వే
–అన్ని రాష్ట్రాలకు సమాచారం పంపిన కేంద్ర ప్రభుత్వం
–2025లో మరింత కష్టపడుతామ న్న ప్రధాని మోదీ
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: రైతన్నకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందిం చింది. దేశవ్యాప్తంగా రైతులు, పేద లకు ప్రధాని మోదీ నూతన సంవ త్సర కానుకలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదా తలకు అందిస్తున్న పెట్టు బడి సాయాన్ని మరికొంత పెంచు తున్నట్లు వెల్లడించారు. అదే విధం గా దేశంలో పేదల కోసం మరో 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి అవ సరమైన సర్వే చేయాలని నిర్ణయించారు. కాగా 2019 నుంచి మోదీ సర్కా రు ఏటా రైతులకు రూ.6 వేలు పెట్టుబడి సాయం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున మూడు విడ తల్లో అన్నదాతల ఖాతాల్లో సొ మ్మును జమ చేస్తున్నారు.
ఈ మొత్తాన్ని ఇప్పుడు రూ.10 వేలకు పెంచుతున్నట్లు మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా రూ.10 వేలు జమ చేయనున్నట్లు ప్రకటించారు. కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని.. ఆర్థిక మంత్రి నిర్మల త్వరలో ప్రవేశపెట్టే 2025–26 బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు ఇదివరకే పేర్కొన్నాయి. అయితే దానికి ముందే ఆ మొ త్తాన్ని రూ.10 వేలకు పెంచు తు న్నట్లు మంగళవారం ప్రధాని స్వ యంగా వెల్లడించడం గమనార్హం. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆరేళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకానికి దేశవ్యా ప్తంగా విశేష ఆదరణ ఉంది. రైతు లకు పంట సాయం కింద బాగా ఉపయోగపడుతోంది. ఇప్పటి వర కు కేంద్రం 18 వాయిదాలు చెల్లిం చింది.
కొత్త ఏడాది ఫిబ్రవరిలో 19వ వాయిదా జమ కోసం రైతు లు ఎదురుచూస్తున్న తరుణంలో ప్రధాని ప్రకటన వారిలో ఆనందో త్సాహాలు రేపింది. దేశంలో పేదల కోసం మరో 2 కోట్ల ఇళ్లను నిర్మించే విషయంపై సర్వే జరిపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిచింది. ప్రధాని మోదీ తరఫున నూతన సంవత్సర కానుకగా ఈ నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి 31లోపు ఈ సర్వేను పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రాధాన్య ప్రాతిపదికన ఈ సర్వేను మూడు నెలల్లో పూర్తి చేయాలంటూ డిసెం బరు 27న కేంద్రం అన్ని రాష్ట్రా లకూ లేఖ రాసింది. ‘ఆవాస్ 2024’ పేరిట రూపొందించిన యాప్లో ప్రజలు స్వయంగా సర్వేలో పాల్గొనేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. గత సెప్టెంబరు లో ప్రధాని మోదీ ఈ యాప్ను ప్రా రంభించారు.
ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ ద్వారా ప్రజలు సర్వేలో పాల్గొనే అవకాశం కల్పించారు. కాగా పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని బీజేపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అయితే రాబోయే నాలుగేళ్లలో అదనంగా 2 కోట్ల ఇళ్లు నిర్మించా లని కేంద్రం భావిస్తున్నట్లు గ్రామీ ణాభివృద్ధి శాఖ మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. ఇప్పటి వరకు ఎన్డీయే సర్కారు మొత్తం 3.33 కోట్ల ఇళ్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా లకు కేటాయించగా, అందులో 3.22 కోట్ల ఇళ్లు మంజూరయ్యా యని.. 2.68 కోట్ల ఇళ్లు నిర్మించా రని తెలిపింది. పీఎంఏవై గ్రామీణ లబ్ధిదారులను గుర్తించేందుకు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఫేస్ టెక్నాలజీని రూపొందించామని, దీనివల్ల మోసాలకు అవకాశం ఉండదని వెల్లడించింది.
మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఆకాంక్షల భారతావనికి ప్రధాని మోదీ నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలియజేశారు. ‘‘అంత రిక్షం నుంచి భూమి వరకు రైల్వేస్ నుంచి రన్వేస్ దాకా సంస్కృతి నుంచి ఆవిష్కరణ వరకు 2024లో భారత్ గణనీయ పురోగతిని, పరి వర్తనను సాధించింది. ప్రగతి దిశగా నా భారత్ వడివడిగా అడుగులే స్తోంది. మేరా భారత్ బఢ్ రహా’’ అని ‘ఎక్స్’లో తెలిపారు. 2025లో కి విశ్వాసంతో అడుగుపెడుతున్న తరుణంలో తన ట్వీట్ను కవితా వేడుకగా అభివర్ణించారు. 202 4లో భారత విజయాలను, చేరు కున్న మైలురాళ్లను వివరించే 2.41 నిమిషాల వీడియోను ఈ సంద ర్భంగా ఆయన పోస్టు చేశారు.
ఇందులో అంతరిక్ష ప్రయోగాల విజయాలు,సూపర్–కంప్యూటింగ్, రక్షణ ఉత్పత్తుల పెంపు, పౌరవి మానయాన పరిశ్రమ వృద్ధి, హౌరా మైదాన్ అండర్వాటర్ మెట్రో, రామేశ్వరం రైలు వంతెన, వందే భారత్ రైళ్లు, దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల పెంపు, ఆరోగ్య సౌక ర్యాల మెరుగుదల, అటల్ పెన్షన్ స్కీం, పీఎం ఆవాస్ యోజన, అబు దాబిలో దేవాలయ ప్రతిష్ఠ, మూడు కొత్త క్రిమినల్ చట్టాల అమలు మొ దలైనవాటి ప్రస్తావన ఉంది. 2024లో తన ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టు కార్డు ఉంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు 70 వేల కోట్ల డాలర్లకు చేరుకోవడం సహా ఆర్థిక రంగానికి సంబంధించిన ప్రత్యేక సమాచారాన్ని కూడా అందులో పొందుపరిచారు.
ఆసియాలో మూడో అతిపెద్ద శక్తిగా భారత్ ఆవిర్భవించడం.. ఉపాధి కల్పన రంగంలో 4.1 కోట్ల మంది యువతకు రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీ అందించడం, క్రీడల రంగంలో.. పారా–ఒలింపిక్స్లో రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించడం.. పర్యావరణహితం కోరి ‘అమ్మ పేరుతో ఒక మొక్క నాటుదాం (ఏక్ పేడ్ మా కే నామ్)’ అన్న సందేశం.. గ్రీన్ పవర్ ఉత్పత్తి సామర్థ్యం మొదలైనవాటిని కూడా వివరించారు. సమష్టి కృషితో 2024లో అనేక విజయాలు అందుకున్నామన్నారు. 2025లో మరింత కష్టించి ‘వికసిత్ భారత్’ కలను సాకారం చేసుకుందామని తెలిపారు. కొత్త సంవత్సరం అందరికీ పురోగతి, శాంతి, ఆరోగ్యం అందిస్తుందన్న ఆశాభావాన్ని మోదీ వ్యక్తంచేశారు.