Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Srinivas Reddy: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

*కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి. శ్రీనివాస రెడ్డి

Srinivas Reddy: ప్రజాదీవెన, కోదాడ: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి. శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) అన్నారు. గురువారం పట్టణంలోని పిఎసిఎస్ కార్యాలయంలో (At PACS office) 2 లక్షలరుణమాఫీ జరిగిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మవతి రెడ్డి ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మాట్లాడారు. ఎన్నికల సమయంలో రైతులకు హామీ ఇచ్చిన ప్రకారం రెండు లక్షల రుణమాఫీ (Two lakh loan waiver)చేసి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వముగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఆయన అన్నారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు .వివిధ కారణాల వల్ల మాఫీ కానీ రైతులకు ఆగస్టు 30 లోపు రైతులందరి రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందన్నది అన్నారు. సీఈఓ మంద. వెంకటేశ్వర్లు,. ఎం రాములు కోటయ్య, సత్యనారాయణ సంపేట ఉపేందర్, వైస్ చైర్మన్ బుడిగం నరేష్ , గోబ్రా చంద్రమౌళి ,పార్వతి, రమాదేవి , బెజవాడ రామకృష్ణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు