Uday Kiran : ప్రజా దీవెన, అమరావతి: అనతి కాలంలోనే అధిక డబ్బును సంపా దించాలనే ఆశతో ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడి అప్పు లపాలై ఆత్మహత్య చేసుకున్న ఘ టన ఏపీలో చోటు చేసుకుంది. నరసరావుపేటలో కూరగాయల వ్యాపారం చేసుకునే కనుపోలు ఉదయ్కిరణ్(32) అనే యువకు డు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. బెట్టింగ్లో రూ. 10 లక్షలు పోగొట్టుకోవడంతో అప్పుల బారిన పడ్డాడు.
మంగళవారం ఇంట్లో ఎవ రూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుం బ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీ సులు ఘటనా చేరుకుని కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.