–మెడిటేషన్ తో మానసిక ప్రశాంతత
–ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా కోఆర్డినేట ర్ పల్లపు బుద్ధుడు
YOGA: ప్రజా దీవెన, చిట్యాల: నిరంతరం యోగ, మెడిటేషన్ వల్ల ప్రతి ఒక్క రికి మానసిక ప్రశాంతత లభిస్తుం దని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా కోఆ ర్డినేటర్ పల్లపు బుద్ధుడు పేర్కొన్నా రు. గురువారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ప్రభుత్వ ఉన్న త పాఠశాల విద్యార్థులచే యోగా కార్యక్రమాలు (Yoga programs) చేయించడం జరిగిం దని, యోగసనాలు వేయించి మెడి టేషన్ చేయించాన్నారు పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) పురస్కరించుకొని ఉరుమడ్ల పాఠ శాలలో ఈ యొక్క యోగ కార్యక్ర మాలు చేసుకోవడం చాలా సంతోష కరమని వ్యాఖ్యానించారు. మనసు ను తన ఆధీనంలోకి తీసు కురావ డమే మెడిటేషన్ అన్నారు. వర్తమా నంలో పొందే ఆనందం కూడా ఈ క్రియలో భాగమని చెప్పారు.
ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ (The Art of Living Course) ద్వారా హ్యాపీనెస్ (Happiness) ప్రతి ఒక్కరికి అందించాలని దృూడ సంకల్పంతో ప్రతి ఒక్కరు ఆనందం గా ఆరోగ్యంగా జీవించాలని కోరా రు.ఈ కార్యక్రమంలో సీనియర్ వాలంటీర్ చే వామప్, యోగాస నాలు వేయించడం జరిగింది. ఈ యోగ మెడిటేషన్ (Yoga meditation) కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు తమ ఆనం దాన్ని వ్యక్తం చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ ఒత్తిడిని పారదోలి ఆచరణాత్మక చర్యలకు వీలు కల్పిస్తూ మన ఆరోగ్యాన్ని మరియు జీవశక్తిని పెంపొందిస్తుంది అన్నారు.
దీని ద్వారా ధ్యానం మరియు ఉచ్ఛ్వాస నిశ్వాసలను చక్కగా పొందుతారు. శారీరక మరియు మానసిక బలహీనత నుండి విముక్తి చెందుతారన్నారు. ఎటువంటి సమ స్యనైనా ఎదుర్కొనే శక్తి యోగ, మెడిటేషన్లకు ఉన్నదని, విద్యార్థు లు చదువులలో రాణించాలంటే ప్రతినిత్యం యోగా మెడిటేషన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల (SCHOOL) ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి ఉపాధ్యాయులు స్వామి కృష్ణమూర్తి నాగయ్య కృష్ణ జహీసా బేగం, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొనేటి యాదగిరి, చెరుకు సైదులు, మేడ బోయిన శ్రీను, కురుపాటి లింగయ్య, గంగాపురం వెంకన్న, గుత్తా రవీందర్ రెడ్డి, బొడ్డు శ్రీను, పట్ల జనార్ధన్, సత్యనారాయణ దినేష్ శ్రీను స్వామి తదితరులు పాల్గొన్నారు.