BSNL: గత కొన్ని రోజులుగా టెలికం సంస్థల మధ్య తీవ్రమైన పోటీ జరుగుతుంది.. జియో వచ్చిన తర్వాత రీఛార్జి ఛార్జీలు భారీగా తగ్గిన విషయం అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఇటీవల టెలికం సంస్థలు టారిఫ్లను (traffic plans) ఒక్కసారిగా పెంచిన సంగతి కూడా అందరికి తెలిసిందే. జియోతో మొదలైన ఈ పెంపు దేశంలోని అన్ని ప్రధాన టెలికం సంస్థలు కొనసాగించాల్సిన పరిస్థితికి దారి తీశాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL)యూజర్లను పెద్ద ఎత్తున బాగా అక్కటుకుంటుంది.
బీఎస్ఎన్ఎల్ రకరకాల రీఛార్జ్ ప్లాన్స్తో (Recharge plans)మెరుగైన సేవలను ప్రవేశ పెడుతుంది. దీంతో బీఎస్ఎన్ఎల్కు ఒక్కసారిగా సబ్స్క్రైబర్స్ బాగా పెరిగిపోయారు. ఇప్పుడిప్పుడే 4జీ సేవలను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోన్న బీఎస్ఎన్ఎల్ యూజర్లను ఆకర్షించే దిశగా కొత్తగా రీఛార్జ్ ప్లాన్స్ను మార్కెట్ లో విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆకర్షణీయమైన ప్లాన్ను పరిచయం చేసింది. ఎక్కువ కాలం వ్యాలిడిటీతో పాటు, డేటా ఎక్కువ కావాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్గా (best option)అనే అనుకోవాలి… అది ఏమిటంటే.. బీఎస్ఎన్ఎల్ ఏడాది వ్యాలిడిటీతో ఈ ప్లాన్ను తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ రూ. 2999 రీఛార్జ్ (Recharge)ప్లాన్ను పరిచయం చేసింది. దీంతో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. బీఎస్ఎన్ఎల్ కస్టమర్స్ ఒక్కసారిగా రీఛార్జ్ (Recharge) చేసుకుంటే.. ఏడాదంతా అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ను కేసుల పొందొచ్చు. అలాగే యూజర్లకు ప్రతీ రోజూ కూడా 3జీబీ డేటా లభిస్తుంది. వీటితో పాటు ప్రతీ రోజూ ఉచితంగా 100 ఎస్ఎంఎస్లు చేసుకునే అవకాశం కూడా కల్పించింది.
ఇది ఇలా ఉండగా మరో వైపు ఏడాది వ్యాలిడిటీతో రోజుకు 3 జీబీ డేటా లభించే రీఛార్జ్ ప్లాన్స్ ఇతర ఏ నెట్వర్క్ పరిధిలో లేకపోవడం అందర్నీ అక్కటుకుట్టుంది . మరి బీఎస్ఎన్ఎల్ (bsnl) నుంచి వస్తున్న పోటీని తట్టుకునే క్రమంలో ఇతర సంస్థలు ఎలాంటి ఆఫర్స్ ప్రకటిస్తాయో చూడాలి.