Cashew nut: కేంద్ర బడ్జెట్ (Central Budget)అమలు తరువాత బంగారం ధరలు దిగి వస్తే.. తెల్ల బంగారం (జీడి పప్పు) ధరలకు మాత్రం త్వరలో రెక్కలు రానున్నాయి. ఈసారి బడ్జెట్ (Central Budget)ప్రభావం లేనప్పటికీ దేశీయ, అంతర్జాతీయపరంగా వచ్చిన మార్పులే జీడి పప్పు ధరల పెరుగుదలకు కారణం అని తెలుస్తుంది. మార్కెట్ (market) వర్గాలు అంతా అనుకున్నట్టు జరిగితే ఆగష్టు రెండవ వారం నుంచే ఈ డ్రై ప్రుట్ ధర పెరగనుంది అంట .
ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా జీడి దిగుబడి తగ్గడంతో రైతులు పండించిన జీడిపప్పు (cashew nut)ధరలు పెరిగాయి. ఉత్పాదక దేశాల్లో జీడిపప్పు ఉత్పత్తి తగ్గడం వల్ల ఈ ఏడాది ఏప్రిల్-మేలో టన్ను జీడిపప్పు ధర పెరిగి 1200-1300 డాలర్లు ఉండగా, ఇటీవల వాటి ధర 1900-2000 డాలర్లకు పెరిగింది. శ్రీకాకుళం జిల్లాలో 2014లో 80 కిలోల జీడిపప్పు రూ.14వేలు పలుకగా… ఇటీవలి కాలంలో ధర రూ.12వేలకు పడిపోయింది. అయితే ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో 80 కిలోల జీడిపప్పు ధర రూ.14 వేలకు చేరింది. అయితే జీడిపప్పు ధరలు పెరిగినా జీడిపప్పు రైతులకు మాత్రం లాభాలు రావడం లేదని రైతు సంఘం బాధ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆగస్టు నుంచి దీపావళి వరకు అంతర్జాతీయంగా జీడిపప్పు, పప్పుల ధరలు గణనీయంగా పెరుగుతాయని అంచనా. 2025 పంట కాలం తర్వాత ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. మొత్తంమీద, ప్రపంచ నగదు మార్కెట్ (market) 2024లో $782 బిలియన్లకు చేరుకుంటుంది మరియు 2029 నాటికి $920 బిలియన్లకు చేరుకుంటుంది, వార్షిక వృద్ధి రేటు 3.31 శాతం.