Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Credit Cards: ఈ క్రెడిట్ కార్డు లకు న్యూ రూల్స్…!

Credit Cards: ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డ్ వాడడం ఒక అలవాటుగా మారింది. అలాగే క్రెడిట్ కార్డులు సామాన్యుల జీవితాన్ని సులభతరం చేశాయి. ప్రజలు తరచుగా షాపింగ్‌తో సహా అన్ని లావాదేవీల కోసం క్రెడిట్ కార్డ్‌ (credit cards)లను వాడుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే జులై నెల ప్రారంభం కావడంతో.. దీంతో పలు బ్యాంకుల క్రెడిట్ కార్డులకు సంబంధించిన నిబంధనలలో మార్పులు అమలు చేయబోతుంది. ఇందులో రివార్డ్ పాయింట్ల (reward points) నుండి కార్డ్ సంబంధిత ఛార్జీల వరకు అన్నీ కూడా మార్పులు చేసాయి. అవి ఏమిటంటే..

1. ఎస్‌బీఐ కార్డ్ (sbi card)ఇప్పుడు జులై 1, 2024 నుండి ఎలాంటి ప్రభుత్వ లావాదేవీలపైనా కస్టమర్‌లు రివార్డ్ పాయింట్‌లను అందలేరని తెలిపింది. అయితే కొన్ని ఎస్‌బీఐ కార్డ్‌లలో (sbi card) ఈ సదుపాయం జూలై 15, 2024 నుండి పని చేయవని ఎస్‌బీఐ తెలిపింది.

2. ఐసిఐసిఐ (icici) బ్యాంక్ కూడా క్రెడిట్ కార్డ్‌ (credit cards)లకు సంబంధించిన కొత్త నిబంధనలను జూలై 1, 2024 నుండి అమలు చేయాలని అనుకున్నది. ఈ నెల నుంచి ఐసీఐసీఐ కార్డు హోల్డర్లు కార్డు రీప్లేస్‌మెంట్ కోసం రూ.100కి బదులుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చెక్కు, నగదు పికప్‌ పై రూ. 100 చార్జీలు ఆగిపోనున్నాయి. అలాగే ఛార్జ్ స్లిప్ అభ్యర్థనపై రూ.100 ఛార్జీ కూడా నిలిపివేయబడింది. చెక్కు విలువ రూ. 100పై 1% ఛార్జీని నిలిపివేయాలని అనుకున్నట్లు సమాచారం. దీనితో పాటు, ఇప్పుడు డూప్లికేట్ స్టేట్‌మెంట్ అభ్యర్థన పై రూ. 100 రుసుము సర్వీస్ కి కూడా ఆపేయనుంది.

3. జూలై 15, 2024 నాటికి అన్ని మైగ్రేషన్ ప్రక్రియలను పూర్తి చేయాలని యాక్సిస్ బ్యాంక్ సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ (citi bank credit card) లను ఉపయోగించే కస్టమర్లకు తెలియచేసింది. అంతేకాకుండా బ్యాంక్ తన ఖాతాదారులకు ఇమెయిల్ (email) ద్వారా సమాచారం ఇవ్వనున్నది.

4. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (hdfc bank)తన క్రెడిట్ కార్డ్ నిబంధనలను కూడా చేంజ్ అవుతున్నాయి. అయితే ఈ బ్యాంకు నియమం ఆగస్టు 1, 2024 నుండి అమలులోకి రాబోతున్నట్లు బ్యాంకు వారు తెలిపారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లిమిటెడ్ క్రెడిట్ కార్డ్ కస్టమర్‌లు ఇప్పుడు CRED, పేటియం, Cheq, మోబిక్విక్, ఫ్రీఛార్జ్ వంటి ప్లాట్‌ఫారమ్లను ఉపయోగించడం కోసం మరింత ఎక్స్ట్రా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.