Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Footwear Costs: భారీగా పెరగనున్న చెప్పుల ధరలు ఎందుకంటే

Footwear Costs: జర్నల్ గా ఎదుటి వారు ధరించే షూ ఆధారంగా ఆ వ్యక్తి ఎలాంటి వాడో? చెప్పవచ్చని కొందరు అంటూ ఉంటారు. ముఖ్యంగా ఆర్మీలో (army) పని చేసే వారు ఈ విషయంలో చాలా కరెక్ట్ ఉంటారు అని అందరి భావన. అయితే ఇటీవల భారతదేశంలో మెరుగైన జీవనశైలి ఆధారంగా బట్టలు, చెప్పులకు అధిక ధర వెచ్చించే వారి సంఖ్య బాగా పెరిగింది అనే చెప్పాలి. ఇక ఒక్కోసారి మనం మార్కెట్‌లో వేల రూపాయలు పోసి చెప్పులు కొనుగోలు చేస్తూ ఉంటాం. అయితే ఎంత ధరతో చెప్పులను కొనుగోలు చేసినా పెట్టిన ధరకు వచ్చిన నాణ్యతకు సంబంధం ఉండదు. ఇక మరో వైపు ఆగస్టు 1 నుంచి పాదరక్షల అమ్మకాల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. మార్కెట్లో విక్రయించే బూట్లు, చెప్పులు విషయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అప్‌డేటెడ్ నాణ్యత మార్గదర్శకాలను పాటించాలని క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (Quality control order)తెలియచేసింది. దింతో నిబంధనలు పాటించడం వల్ల దేశీయంగా పాదరక్షల ధరలు పెరిగే అవకాశం ఉన్నటు సమాచారం. ఇక ధర పెరిగినా నాణ్యమైన వస్తువు మనకు చేరుతుందని గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాణ్యతాప్రమాణాలు మెరుగుపర్చడం ద్వారా చెప్పుల ధరలు ఏ స్థాయిలో పెరుగుతాయో చూద్దామా మరి..

ఇక ఆగస్టు 1, 2024 నుంచి పాదరక్షల పరిశ్రమకు (For footwear industry) సంబంధించిన కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త నిబంధనలు మార్కెట్‌లో లభించే పాదరక్షల ఉత్పత్తుల నాణ్యత, భద్రతను మెరుగుపరుస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. పాదరక్షల భాగాలు, లోపలి లైనింగ్ నుంచి బయటి సోల్ వరకు, రసాయన కూర్పు, మన్నిక వంటి వివరాల కోసం కఠినమైన పరీక్షలు చేయాల్సి ఉంట్టు సమాచారం. ఇక నుంచి పాదరక్షల తయారీదారులు తప్పనిసరిగా ఐఎస్ 6721, ఐఎస్ 10702 మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి, ఇవి ముడి పదార్థాలు, నిర్మాణం, మొత్తం మన్నికపై కఠినమైన నిబంధనలు కూడా ఉంటాయట.

ఈ కొత్త ప్రమాణాలకు (New standards) అనుగుణంగా పెరిగిన ఖర్చుల కారణంగా పాదరక్షల ధర పెరగవచ్చని నిపుణులు అంచనా . అయితే నిబంధనలను అమలు చేసిన తర్వాత చూడాల్సి ఉంటుంది ఆలా ఉంటాయి అని.ఇక అలాగే విక్రేతలు పాత స్టాక్‌ను విక్రయించడాన్ని కొనసాగించవచ్చు కానీ ఈ ఇన్వెంటరీ వివరాలను తప్పనిసరిగా బీఐఎస్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 46 రకాల పాదరక్షల వస్తువులు సవరించిన బీఐఎస్ నిబంధనలకు లోబడి ఉంటాయి అని తెలుస్తుంది.అలాగే వార్షిక టర్నోవర్ రూ.50 కోట్ల కంటే తక్కువ ఉన్న తయారీదారులకు బీఐఎస్ నియమం వర్తించదు అని క్లియర్ గా తెలిపింది. అందువల్ల స్టార్టప్ కంపెనీలను (A startup company) ఈ నిర్ణయం పెద్దగా ప్రభావితం ఉండదు అనే చెప్పాలి.