Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

If you play offline, that’s it: అన్ లైన్ అటలాడితే ఇకపై అంతే 

-- అక్టోబర్ నుంచి అటాడితే పన్నులే పన్నులు -- ఆ అటలపై వస్తు-సేవల పన్నులతో బాధుడే

అన్ లైన్ అటలాడితే ఇకపై అంతే 

— అక్టోబర్ నుంచి అటాడితే పన్నులే పన్నులు
— ఆ అటలపై వస్తు-సేవల పన్నులతో బాధుడే

ప్రజా దీవెన/న్యూఢిల్లీ: చిన్నా పెద్దా తేడా లేకుండా చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు అన్ లైన్ ఆటలతో గంటల తరబడి కాలగడిపే వారికి షాక్ తగలనుంది. షాక్ అంటే కరెంట్ షాక్, ఫోన్ షాక్ కాదు… పన్నుల షాక్.. అదేనండి వస్తు-సేవల పన్ను అంటే జి ఎస్ టి.
అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతంగా జి ఎస్ టి విధించేందుకు (To levy 28 percent GST on online gaming from October 1) విధి విధానాలు రూపుదిద్దుకున్నాయి.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ అగర్వాల్ (Central Board of Indirect Taxes and Customs (CBIC) Chairman Sanjay Agarwal)  ఇదే అంశంపై సవివరంగా వివరాలు వెల్లడించారు. తాజాగా అమలులోకి రానున్న ప్రక్రియలో భాగంగా గేమింగ్ కంపెనీలకు లీగల్ నోటీసులు కూడా పంపినట్లు తెలిపారు. సెప్టెంబర్ 30లోగా అన్ని రాష్ట్రాల శాసనసభలు జిఎస్‌టి సవరణ బిల్లు 2023ని ఆమోదించాలని లేదంటే ఆర్డినెన్స్ తీసుకరావడం (State Legislatures to pass GST Amendment Bill 2023 or bring Ordinance) ద్వారా అక్టోబర్ 1 నుంచి విధిగా అమలు చేయాలని సంజయ్ అగర్వాల్ స్పష్టం చేశారు.

ఇది అమలులోకి వచ్చిన 6 నెలల తర్వాత ఫలితాలలను రివ్యూ చేస్తామని అయన వెల్లడించారు. ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందెం, క్యాసినోలపై 28 శాతం జీఎస్టీ విధిస్తున్నట్లు ( 28 percent GST levied on online gaming, horse racing, casinos) జీఎస్టీ కౌన్సిల్ జూలైలో ప్రకటించింది. ఆగస్టు 2న జరిగిన 51వ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతo అనేక ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు 18 శాతం GST చెల్లిస్తున్నాయి.

క్యాసినోలు, బెట్టింగ్ అలాగే అవకాశంతో కూడిన ఇతర గేమ్‌లు 28 శాతం జీఎస్టీ పరిధిలో ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. గుర్రపు స్వారీ లేదా గుర్రపు పందేలలో, ఒక బెట్టింగ్ కు వచ్చే వాటా విలువపై ప్రభుత్వం 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తుంది. భారత్ లో ఆన్‌లైన్ గేమింగ్ మార్కెట్ ఎంత ఉంటుందో కూడా అనేరకాలైన గణాంకాలు (Various statistics about the size of the online gaming market in India) వెల్లడిస్తున్నాయి.

దేశంలోని 40 కోట్ల మంది ప్రజలు ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతున్నారని, 2025 నాటికి ఈ పరిశ్రమ విలువ 5 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 41 వేల కోట్లుగా (By 2025, this industry will be worth 5 billion dollars which is about Rs. 41 thousand crores) ఉంటుందని అంచనా వేస్తున్నారు. దేశీయ మొబైల్ గేమింగ్ పరిశ్రమలు 2017-2020 మధ్య సంవత్సరానికి 38% చొప్పున వృద్ధి చెందాయంటే అన్ లైన్ ఆటల ప్రభావం సమాజంపై ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.