Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Satellite-Based Toll : శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్..?

Satellite-Based Toll :ఇక నుంచి టోల్ గేట్ల యుగనికి అంతం అయి శాటిలైట్ ఆధారిత టోల్ వసూళ్ల (Satellite-Based Toll)రాబోతుంది. అవును మీరు విన్నది నిజమే.. మారుతున్న కాలానికి తగ్గట్టే పన్నులు, సుంకాలు, టోల్ వసూళ్లలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాబోతుంది. అతి భారీ ఖర్చుతో నిర్మించే జాతీయ రహదారులు, ‘ఎక్స్‌ప్రెస్ వే’ల మీద టోల్ గేట్లు (Toll gates) ఏర్పాటు చేసి, వాహనదారుల నుంచి టోల్ వసూల్ చేయడం అందరికీ తెలిసిందే . ఇది ప్రారంభంలో టోల్ గేట్ల వద్ద నగదు రూపేణా చెల్లింపులు జరిగేవి. అయితే ఆ నగదు చెల్లింపుల కారణంగా టోల్ గేట్ల వద్ద వాహనాలు ఎక్కువ సేపు నిలిపి ఉంచాల్సిన పరిస్థితులు ఉండేవి. మరోవైపు దొంగలు, దోపిడీ ముఠాలు టోల్ గేట్లను (Toll gates) లక్ష్యంగా చేసుకుని వసూలు చేసిన టోల్ సొమ్మును దోచుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో క్రెడిట్ / డెబిట్ కార్డుల (Credit / Debit Cards) ద్వారా చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. అనంతరం ప్రస్తుతం అమలవుతున్న ‘ఫాస్టాగ్’ విధానంతో చిల్లర నగదు, వసూలు చేసిన సొమ్ముకు భద్రత వంటి సమస్యలు పూర్తిగా పరిష్కారమవడంతో పాటు వాహనాలు వేగంగా టోల్ గేటు దాటుకుని ముందుకెళ్లేందుకు ఈజీగా ఉండేది. అయితే టోల్ విధానంలో ప్రయాణించిన దూరానికి తగ్గట్టు సమంగా చెల్లింపులు సర్రిగ్గా జరగడం లేదు, అలాగే టోల్ గేట్ దాటిన వెంటనే గమ్యం చేరేవారైనా, మరో టోల్ గేట్ కంటే ముందు గమ్యం చేరినవారైనా ఒకే మొత్తంలో టోల్ చెల్లించాల్సి సందర్భాలు ఉన్నాయి . ఈ వ్యవస్థలోజాతీయ రహదారులపై సగటున ప్రతి 60 కి.మీ దూరానికి ఒక టోల్ గేట్ ఉంటుంది. ప్రతి టోల్ గేట్ వద్ద నిర్ణీత సొమ్ము వసూల్ అవుతుంది. ఒక కారు 61కి.మీ ప్రయాణించినా, 119 కి.మీ ప్రయాణించినా ఒకే మొత్తంలో చెల్లింపులు జరపాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ తారతమ్యాలను సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయాణించిన దూరానికి మాత్రమే చెల్లింపులు జరిపేలా సరికొత్తగా శాటిలైట్ టెక్నాలజీని వినియోగించుకోవాలని తెలుపుతుంది.

ఇక ఈ సరికొత్త విధానాన్ని గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS)గా వ్యవహరిస్తారట . అతి త్వరలోనే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని తెలిపినట్లు సమాచారం . ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఈ సరికొత్త టోల్ విధానాన్ని కర్ణాటకలోని బెంగళూరు – మైసూర్ మధ్య ఉన్న నేషనల్ హైవే-275 తో పాటు హర్యానాలోని పానిపట్ – హిస్సార్ మధ్య ఉన్న నేషనల్ హైవే 709పై ప్రయోగాత్మకంగా అమలు చేసినట్టు కూడా తెలిపారు. అలాగే ఈ మొత్త టోల్ వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్న అందరికీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించేందుకు జూన్ 25న వర్క్‌షాప్ కూడా ఏర్పాటు చేశామని గడ్కరీ అన్నారు. అలాగే గ్లోబల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (EOI) కోసం జూన్ 7 నుంచే ఆహ్వానాలు స్వీకరించడం ప్రారంభించామని, జులై 22తో డెడ్‌లైన్ పూర్తి అవుతుందని అన్నారు . అయితే ఇక పై ప్రయాణించిన దూరానికి తగిన సొమ్ము వాహనదారుల ఖాతా నుంచి కట్ అవుతుంది.

అంతేకాకుండా ఇకపై జాతీయ రహదారులపై ప్రయాణించేవారు టోల్ గేట్ల వద్ద వాహనాలను ఆపాల్సిన అవసరం కూడా ఉండబోవుచు. అలాగే అసలు రహదారిపై టోల్ గేట్లే ఉండవు. వాహనం ప్రయాణించిన దూరం మొత్తం శాటిలైట్ జీపీఎస్ వ్యవస్థ లైకింపులు చేస్తారు. జాతీయ రహదారి నుంచి దిగగానే ఆ మేరకు ఖాతా నుంచి సొమ్ము చెల్లింపులు జరిగిపోతాయి. అయితే ఇదంతా జరగడానికి ప్రతి వాహనానికి సరికొత్త జీపీఎస్ నెంబర్ ప్లేట్లను అమర్చాల్సి ఉంటుంది. రహదారులపై ఏర్పాటు చేసే కెమేరాల్లో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రీడర్ (ANPR) వ్యవస్థ ఉంటుంది. వాహనం జాతీయ రహదారిపైకి చేరుకున్న వెంటనే ఈ కెమేరాలు స్కాన్ చేసి శాటిలైట్‌కు సమాచారం పంపిస్తాయి. తద్వారా వాహనం ప్రయాణించిన మొత్తం దూరం శాటిలైట్ – జీపీఎస్ వ్యవస్థ లెక్కించగల్గుతుంది.

అయితే అమలు అవుతున్న ఫాస్టాగ్ వ్యవస్థలో ప్రతి వాహనానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ కల్గిన ఫాస్టాగ్‌ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది. వాహనం టోల్ గేట్ సమీపించగానే అక్కడున్న RFID రీడర్స్ వాహనంలో ఏర్పాటు చేసిన చిప్ నుంచి సమాచారాన్ని సేకరించి, ఫాస్టాగ్ వ్యాలెట్‌లో నింపిన ప్రీ-పెయిడ్ సొమ్ము నుంచి టోల్ వసూలు చేపడుతుంది. ఇక నూతన విధానం అమల్లోకి వచ్చిన తర్వాత టోల్ గేట్ల వద్ద ఎక్కువ సమయం వేచి చూడాల్సిన పరిస్థితులు ఉండవు . అలాగే క్షణాల వ్యవధిలోనే వాహనాలు టోల్ గేట్ దాటుకుని వెళ్లి పోవచ్చు. చూడాలి మరి ఈ నూతన విధానం ఎప్పటి నుంచి అమలు లోకి రావచ్చో.