Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big Breaking : బిగ్ బ్రేకింగ్, అప్పన్న సన్నిధిలో అపశ్రుతి, భక్తుల మృత్యువాత

Big Breaking :ప్రజా దీవెన విశాఖ: ప్రఖ్యాత సిం హాద్రి అప్పన్న దేవస్థానంలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. సింహా ద్రి అప్పన్న చందనోత్సవంలో అప శ్రుతి చోటుచేసు కోవడంతో ఈ ప్ర మాదం జరిగింది. భారీ వర్షం నేప థ్యంలో రూ.300 టికెట్‌ క్యూలైన్‌ లో గోడ కూలి ఎనిమిది మంది భ క్తులు మృత్యువాత పడ్డారు. మ రికొందరికి తీవ్రగాయాల పాల య్యారు. గాయపడిన వారిని ఆసు పత్రికి తరలించి చికిత్స అందిస్తు న్నారు. ఏడుగురి మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. స హాయక చర్యలను హోంమంత్రి అ నిత పర్యవేక్షిస్తున్నారు. ఉరుము లు, మెరుపులతో కూడిన భారీ వ ర్షానికి రూ.300 టికెట్‌ క్యూలైన్‌పై గోడ కూలి ఎనిమిది భక్తులు చని పోయారు. మరికొందరికి గాయా లయ్యాయి. క్షతగాత్రులను ఎన్డీఆ ర్‌ఎఫ్‌ సిబ్బంది, అధికారులు ఆస్ప త్రికి తరలించారు.

 

సింహగిరి బ స్టాండ్ నుంచి పైకి వెళ్లే రూట్‌లో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ దగ్గ ర గోడ కూలింది. 300 రూపాయల క్యూ లైన్‌లో మెట్లు ఎక్కుతుండగా ఒక్క సారిగా గోడ కూలిపోయింది. శిథి లాల కింద మరికొందరు ఉన్న ట్లు అనుమానిస్తున్నారు. సహాయ క చర్యలు కొనసాగుతున్నాయి. స హాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీ ఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక టీమ్స్ పాల్గొ న్నాయి. మృతుల సంఖ్య పెరిగే అ వకాశం ఉంది.గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు చిద్రమయ్యాయి. శి థిలాల కింద మరికొందరు ఉండొచ్చ న్న అనుమానంతో 10కి పైగా అం బులెన్స్‌లు అందుబాటులో ఉంచా రు. గోడ కూలిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు హోంమంత్రి అనిత, కలెక్టర్, సీపీ. సహాయక చర్యలను దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. భ క్తులు ఎలాంటి ఆందోళన చెందొద్ద న్నారు.

ఏటా ఒక్కసారి మాత్రమే నిర్వ హిం చే సింహాచలం అప్పన్న చంద నో త్సవానికి భారీగా తరలివస్తారు భక్తులు. 2 లక్షలకు పైగా భక్తులు బుధవారం స్వామివారిని దర్శించు కుంటారని అంచనా వేశారు అధికా రులు. అర్థరాత్రి నుంచే భక్తులు పో టెత్తారు. 3గంటల నుంచి దర్శనం కల్పించడంతో క్యూలైన్లలో కిక్కిరిసి పోయారు భక్తులు. అయితే ఉరు ములు మెరుపులతో కుండపోత వాన కురవడంతో ఒక్కసారిగా గోడ కూలి.. అప్పన్న సన్నిధిలో మహా వి షాదం చోటు చేసుకుంది.