Navaratri celebrations : ప్రజా దీవెన శాలిగౌరారం మార్చి 6: శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని శ్రీ పార్వతి శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో వారం రోజుల పాటు జరిగిన నవరాత్రి ఉత్సవాలు గురువారం ఏకాంత సేవల కార్యక్రమం తో ముగిశాయి.బుధవారం రాత్రి స్వామి వారి ఆంజనేయ ప్రభల ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది.
గురువారం తెల్లవారుజామున నాగవెళ్ళి, అగ్నిగుండాల కార్యక్రమం భక్త జన సమూహం మధ్య జరిగాయి. భక్తులు నిప్పుల మంటల లో నడిచి తమ భక్తి బావాన్ని చాటుకున్నారు.గురువారం రాత్రి ఏకాంత సేవలు కార్యక్రమం తో ఉత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమం లో ఆలయ పురోహితులు వావిలాల వేణునాథ శర్మ, వావిలాల రామలింగయ్య శర్మ, వావిలాల ఫణి కుమార్ శర్మ, దాతలు పాల్గొన్నారు.