Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

The second phase is to examine the distribution of sheep రెండో విడత గొర్రెల పంపిణీ పరిశీలన

-- నాంపల్లి మండలంలో పర్యటించిన దూదిమెట్ల

రెండో విడత గొర్రెల పంపిణీ పరిశీలన

— నాంపల్లి మండలంలో పర్యటించిన దూదిమెట్ల

ప్రజా దీవెన/ నాంపల్లి: రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర షీప్స్ & గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్
దూదిమెట్ల బాలరాజు యాదవ్ పరిశీలించారు. నాంపల్లి మండలం లింగోటం, కేతేపల్లి, బండతిమ్మాపురం, ముష్టి పల్లి, సుంకిశాల గ్రామాల్లో క్షేత్ర స్థాయి లో అధికారులతో కలిసి పరిశీలిoచారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వoలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మార్గదర్శకతో జరుగుతున్న రెండో విడుత గొర్రెల పంపిణీ ని సంబంధిత అధికారులతో పరిశీలించడం జరిగిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం ఈ పథకాన్ని యాదవ కురుమలు ప్రతి ఒక్కరు వినియోగించు కోవాలని కోరారు. పలక అమలులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సదరు అధికారులపై తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను ప్రజలు సద్వినియోగపరచు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ వైధ్యాధికారి డా.యాదగిరి, డా.విశ్వేశ్వర రావు, డా.నాగయ్య, పంగరామ్ మెహన్ యాదవ్, కొండల్ యాదవ్, బెల్లి సత్తయ్య, మాజీ సర్పంచ్ రాజమల్లు యాదవ్, నూనే వెంకటేష్ యాదవ్ ఇతర యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.