PV Sindhu- Ram Charan: ప్రస్తుతం ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఒలింపిక్స్ క్రీడలు (Olympics Games)జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. తొలి రోజు భారత్ కు పతకాలు మనకి రాకపోయినా రెండో రోజుమాత్రం భారత క్రీడాకారులు (Indian sportsmen)బాగా ఆడారు. ఇక మహిళల షూటింగ్ లో మనూ భాకర్ కాంస్య పతకం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్ ఖాతా తెరుచుకుంది అనే చెప్పాలి. మరోవైపు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా తన దైన రీతిలో అదరగొడుతోంది. మహిళల సింగిల్స్లో తొలి మ్యాచ్ లో అలవోకగా విజయం సాధించి తదుపరి రౌండ్ కు దూసుకెళ్లింది. కాగా ఒలింపిక్ గేమ్స్ (Olympic Games)చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ పారిస్ వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే. ఈ తరుణంలో చిరంజీవితో పాటు సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మెగా క్వీన్ క్లింకార కొణిదెల (Chiranjeevi along with Surekha, Ram Charan, Upasana, Mega Queen Klinkara Konidela)పారిస్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పారిస్ వీధుల్లో రామ్ చరణ్, పీవీ సింధు ఎదురు పడ్డారు. ఒకరినొకరు ఆత్మీయంగా కూడా పలకరించుకున్నారు. వీరు అందరు కూడా కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. రామ్ చరణ్ వెంట రైమ్ (పెట్ డాగ్) కూడా ఉండడం విశేషం. ఈ సందర్భంగా పీవీ సింధు… రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఒలింపిక్ గ్రామం అంతా తిప్పి చూపించినట్లు సమాచారం.
ఇక ఈ సందర్భంగా రామ్ చరణ్ పెట్ డాగ్ రైమ్ ను సింధు (sindhu) ముద్దు చేశారు. ‘ఇది ఇలా ఉండగా మీరు ఎక్కడికి వెళ్లినా ఇది మీ వెంట ఉండాల్సిందేనా?’ అని రామ్ చరణ్ ను సింధు అడగగా … ‘తప్పకుండా ఉండాల్సిందే’ అంటూ రామ్ చరణ్ (ram charan)సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం సింధు, రామ్ చరణ్ ల కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది. ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం నాడు కూడా మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన పారిస్ లోని సెన్ నది వద్ద ఉంది చూసారు. అలిగి ఒలింపిక్ టార్చ్ రెప్లికాను చేతబూనిన చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. స్టార్ డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమా లో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా ఉండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు చరణ్, దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా మరో సినిమాలో నటిస్తున్నాడు.
View this post on Instagram