Sree Vishnu: హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన ‘సామజవరగమన’, ‘ఓం భీమ్ బుష్’ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే .. నేడు ‘శ్వాగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాజ రాజ చోర సినిమాకు దర్శకత్వం వహించిన హసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఈ క్రమంలో యూఎస్ లో ఒక రోజు ముందే ప్రీమియర్ షో లతో రీలీజ్ అయ్యేంది . ఇక సినిమా పై చాలా నమ్మకంతో మేకర్స్ ప్రీమియర్ షో (Makers premiere show) లకు సిద్ధం అయ్యినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఉండే ట్విస్ట్లు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడం మాత్రమే కాకుండా అవుట్ అండ్ అవుట్ కామెడీని పండిస్తాయని మేకర్స్రు అంటున్నారు . ఇక ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో శ్రీవిష్ణు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… శ్వాగ్ చాలా డిఫరెంట్ సినిమా, తప్పకుండా అందరిని బాగా అక్కటు కుటుంది. ఒక మంచి వినోదాత్మక సినిమాగా శ్వాగ్ ఉంటుంది. ఆలాగే ఈ సినిమాలో చాలా ట్విస్ట్ లు ఉన్నట్టు తెలుస్తోంది. సినిమాను చూసిన వాళ్లెవరూ కూడా దయచేసి ట్విస్ట్ లను సోషల్ మీడియా ద్వారా లేదా మరెక్కడైనా రివీల్ చేయవద్దంటూ రిక్వెస్ట్ చేసారు. యూఎస్ లో ప్రీమియర్ షో ల నేపథ్యంలో హీరో శ్రీ విష్ణు ఈ విధంగా విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసిన ప్రేక్షకులు ఏ ఒక్కరూ ట్విస్ట్లను(twist) రివీల్ చేయవద్దంటూ హీరో శ్రీవిష్ణు విజ్ఞప్తి చేశారు.
అయితే ప్రస్తుత రోజులలో చిన్న సినిమాలకు మంచి స్పందన వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇండస్ట్రీలో చిన్న సినిమాలు పెద్ద సినిమాల స్థాయిలో వసూళ్లువస్తున్నాయి. కనుక ఈ సినిమా కచ్చితంగా మంచి కాన్సెప్ట్ తో వస్తుంది కనుక బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ శ్వాగ్ చిత్రంలో శ్రీవిష్ణు (Sree Vishnu)నాలుగు డిఫరెంట్ రోల్స్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందులో సింగ పాత్ర చాలా స్పెషల్ గా ఉంటుందని, ప్రతి ఒక్కరు చూడగానే నవ్వుకునే విధంగా ఉంటుందని మేకర్స్ (makers)మొదటి నుంచి అంటూనే ఉన్నారు. ఇప్పటికే నటన విషయంలో పలుసార్లు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న శ్రీవిష్ణు శ్వాగ్ లో అంతకు మించి అన్నట్లుగా నటన ఉంటుందని, అంతే కాకుండా శ్వాగ్ లో శ్రీవిష్ణు (Sree Vishnu) నటన పరంగా కెరీర్ ది బెస్ట్ ఇచ్చినట్లు మేకర్స్ తెలపడం కూడా విశేషం. చూడాలి మరి చివరికి తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి విజయాలకు సొంతం చేసుకుంటుందో చూడాలి..