Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tamannaah: ఈడీ విచారణకు తమన్నా ఎందుకంటే..?

Tamannaah: ప్రముఖ టాలీవుడ్ నటి తమన్నాపై (Tamannaah) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేసారు. అక్రమ నగదు బదిలీ ఆరోపణలపై ఈడీ ప్రశ్నించినట్లు ఈడీ అధికార వర్గాల నుంచి సమాచారం. HPZ టోకెన్ మొబైల్ యాప్‏కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తమన్నాను ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. యాప్ ద్వారా బిట్ కాయిన్, క్రిప్టోకరెన్సీలను మైనింగ్ సాకుతో చాలామంది ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇందులో తమన్నా పై ఎలాంటి నేరారోపణలు లేవు. కానీ కేవలం యాప్‏ను ప్రమోట్ చేసినందుకే ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గౌహతి కార్యాలయంలో విచారించినట్లు సమాచారం. అంతకు ముందు ఈడీ కార్యాలయానికి (ED office) తన తల్లితో కలిసి వచ్చింది తమన్నా. యాప్‏ను ప్రమోట్ చేశారని.. అందుకు కొంత డబ్బు కూడా తీసుకున్నారని.. ఆమెపై ఎలాంటి నేరారోపణలు లేవని సంబంధిత వర్గాలు స్పష్టం చేయగా.. నిన్న తమన్నా వాంగూల్మం తీసుకున్నట్టు సమాచారం.

ఇక వాస్తవానికి తమన్నా భాటియా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల (Officers of Enforcement Directorate)ముందు హాజరుకావడం ఇదే ప్రిస్ట్ టైం కాదు. గతంలో కూడా మహదేవ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన కేసులో తమన్నాను విచారించడం జరిగింది. మహాదేవ అనుబంధ సంస్థ అయిన ఫెయిర్ ప్లే యాప్‏లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ గేమ్ మ్యాచులను ప్రసారం చేసినట్లు ఆరోపణలు కూడా చాలానే వచ్చాయి. దీనిపై మహారాష్ట్ర సైబల్ సెల్ ఏప్రిల్ ను విచారణకు హాజరు కావల్సిని వచ్చింది.