Hyderabad Hotel Kumari aunty : ఆ ఆంటీతో నిత్యం టచ్ లో ఉంటారు తెలుసా
--కుమారీ ఆంటీతో పాటు వారంతా ఫుల్ ఫేమస్
ఆ ఆంటీతో నిత్యం టచ్ లో ఉంటారు తెలుసా
–కుమారీ ఆంటీతో పాటు వారంతా ఫుల్ ఫేమస్
ప్రజా దీవెన, హైదరాబాద్: ఈ మధ్య కాలంలో రాత్రికి రాత్రే ఫేమస్ గా నిలిచిందెవరో అందరికి తెలిసిందే. ఎవరో కాదు, ఆమెనే కుమారి ఆంటీ. ఆయితే కుమారి ఆంటీతో పాటు సోషల్ మీడియా ద్వారా వీ ళ్లూ ఫేమస్ నిలుస్తున్నారు. హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ స్టాల్ నడు పుతున్న కుమారి ఆంటీ ( kumari aunty) ప్రస్తుతం నిత్యం వా ర్తల్లో నిలుస్తోంది.
ఆమె ఎంతగా ఫేమస్ అయిందంటే, సినీ తారలు తమ సినిమాలను ప్ర మోట్ చేసుకోవడానికి ఆమె స్టాల్కి వస్తుంటారు. కుమారి ఆంటీస్ ఫుడ్ పాయింట్ హైదరాబాద్ ( Hyderabad) లోని ఇనార్బిట్ మా ల్ దగ్గర ఉంది. సినిమా తారలు తమ సినిమాల ప్రమోషన్ కోసం ఆయన వద్దకు వస్తారనే విషయాన్ని బట్టి ఆమె ఫుడ్ స్టాల్కు ఉన్న క్రేజ్ని అంచనా వేయవచ్చు.
అందుకే కుమారి ఆంటీ ఫేమస్ అవ్వడమే కాకుండా బాగా డబ్బు సంపాదిస్తోంది. ఆమె సగటు రోజువారీ సంపాదన రూ. 30 వేలు. ఇంతలా ఒక్కసారిగా ఆమె ఫేమస్ (famous) అవ్వడానికి సోష ల్ మీడియా కూడా ఒక కారణం. ఇలా సోషల్ మీడియా ద్వారా తెలుగురాష్ట్రాల్లో ఇంకా చాలా మంది ఫేమస్ అయ్యారు.
రాత్రికి రాత్రి సెలబ్రెటీలు అయి, బాగా సంపాదిస్తున్నారు. టీవీ షోలు, ఇతర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇలాంటి వారి గురించి తెలుసుకుందాం. తెలుగు బిగ్బాస్ తాజా సీజన్ విజేత పల్లవి ప్రశాం త్ గురించి మీకు తెలిసిందే. తొలినాళ్లలో కేవలం టిక్ టాక్ వీడియో లు చేసుకుంటూ ఉండేవాడు.
దాని ద్వారా కొంత మంది అభిమాను లను సంపాదించుకున్నాడు. కొన్నాళ్లకు టిక్ టాక్పై ప్రభుత్వం బ్యాన్ విధించాక యూట్యూబ్ ఛా నల్ పెట్టుకున్నాడు. తాను పొలంలో పడే కష్టం, తనకు వ్యవ సా యం అంటే ఎంత ఇష్టమో తెలియజేశాడు. అలా బిగ్ బాస్లోకి వెళ్లి అక్కడ కూడా అభిమానులను సంపాదించుకున్నాడు.
సెలబ్రెటీలను కాదని విజేతగా నిలిచాడు. ఇక గంగవ్వ ప్రస్తుతం తె లుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎక్కడో తెలంగాణ (Telangana) లోని మారుమూల లంబాడిపల్లిలో ఆమె సాధారణ వృద్ధురాలు ఆమె. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ ఆ మె గురించి తెలిసింది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ఆమెను వ రించాయి.
ఆ తర్వాత బిగ్ బాస్ షోకు కూడా ఆమె వెళ్లింది. అక్కడ కూడా సం దడి చేసింది. ఆమెతో పాటు కేవలం ఒక్క వీడియోతో బర్రెలక్క కూ డా సోషల్ మీడియా (social media) లో ఫేమస్ అయింది. నిరుద్యోగుల కష్టాలను కేవలం ఒక్క వీడియోతో ఆమె కళ్లకు కట్టి నట్లు చూపించింది. ఆమె ను ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు, ఇబ్బందులు వల్ల తన కష్టాలను గురించి అందరికీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి సంచలనంగా మారింది. ఇక కుమారి ఆంటీ విషయానికొస్తే ఆమె గత 13 ఏళ్లుగా ఫుడ్ స్టాల్ నడుపుతోంది. కానీ సోషల్ మీడియా సైట్ల ద్వారా ఆమెకు మంచి పేరు వచ్చింది.
ఆమె ప్రతిరోజూ సుమారు 100 కిలోల బియ్యాన్ని వండి బిర్యానీగా విక్రయిస్తోంది. ఒక మేకను రోజూ కోయిస్తుంది. ఆ ప్రాంతంలో ఆమె స్టాల్కు వస్తున్న ప్రజాదరణ వల్ల పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి, ఆ స్టాల్ తొలగించేలా చేశారు.