Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ASK Free Training: అస్క్ విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు పంట

సోమవారం విడుదలైన పాలీసెట్ 2024 పరీక్ష ఫలితాలలో అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రంలో ఉచిత శిక్షణ పొందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకుల పంట పండించి సత్తా చాటారు

ప్రజా దీవెన,కోదాడ: సోమవారం విడుదలైన పాలీసెట్ 2024 పరీక్ష ఫలితాలలో అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రంలో (Ambedkar Ashaya Sadhana Centre)ఉచిత శిక్షణ పొందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకుల పంట పండించి సత్తా చాటారు. నూనె మణిదీప్ 117 మార్కుల సాధించి రాష్ట్రస్థాయిలో 29వ ర్యాంకు సాధించినట్లు అంబేద్కర్ ఆశయ సాధన అధ్యక్షురాలు బల్గూరి స్నేహ దుర్గయ్య ,ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ సోమవారం పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు ,ఈ సందర్భంగా ఆస్క్ అధ్యక్షురాలు స్నేహ దుర్గయ్య మాట్లాడుతూ కోదాడ పట్టణంలో అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం( Ambedkar Ashaya Sadhana Centre) స్థాపించిన నాటి నుండి నేటి వరకు అనేక పేద పిల్లలకు ఉచిత శిక్షణ అందించి మంచి ఫలితాలు సాధించిన ఘనత అంబేద్కర్ ఆశయ సాధనకి దక్కుతుందని తెలిపారు.

అలాగే 2024 సంవత్సరములో కూడా అంబేద్కర్ ఆశయ సాధనలో ఉచిత శిక్షణ పొందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు పంట పండించి సత్తా చాటారని తెలిపారు మణిదీప్ తో పాటు 105 మార్కులు సాధించి 617 ర్యాంకు గంధం స్రవంతి , కొంగ భవ్య శ్రీ 1001 గంజి రూప 1529 ర్యాంకులు సాధించినట్లు తెలిపారు వీరితోపాటు పదివేల లోపు 12 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పేద విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రానికి (Ambedkar Ashaya Sadhana Centre) మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆస్క్ వ్యవస్థాపకులు బల్గూరి దుర్గయ్య ( ‌ఎ ఈ) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అమర్ బోయిన వెంకటరత్నం చేకూరి రమేష్ కోర్స్ కోఆర్డినేటర్ గంధం బుచ్చారావు చెరుకుపల్లి కిరణ్ కె శ్రీకాంత్ గంధం పండరీ బాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఆస్క్ అధ్యక్షురాలు స్నేహ దుర్గయ్య ను పూలమాల సాలువతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

పాలీసెట్- 2024 లో సత్తా చాటిన అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (AASK) కోదాడ విద్యార్థులు, రాష్ట్రస్థాయిలో 29 వ ర్యాంక్*
అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం( AASK) కోదాడ ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ పొందిన విద్యార్థులు ఈరోజు విడుదలైన ఫలితాలలో *రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి సత్తా చాటారు. వీరిలో నూనె. మణిదీప్ S/o నాగేశ్వరరావు రాష్ట్రస్థాయిలో 117 మార్కులు సాధించి 29వ ర్యాంకును, గంధం స్రవంతి D/o పండరీ బాబు 105 మార్కులు సాధించి 617 ర్యాంకును సాధించారు. కొంగ భవ్య శ్రీ 101 మార్కులు,1011 ర్యాంకు; గంజి రూప శ్రీ మార్కులు 93, ర్యాంకు 1529 ఇలా పదివేల లోపు 12 ర్యాంకులు సాధించడం జరిగింది.

ఈ సందర్భంగా విద్యార్థులను AASK వ్యవస్థాపకులు: బల్గూరి దుర్గయ్య (A.E .ఇరిగేషన్) గారి అధ్యక్షతన సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా AASK అధ్యక్షురాలు బల్గూరి స్నేహ దుర్గయ్య గారు మాట్లాడుతూ,”విద్యార్థులు భవిష్యత్తులో కష్టపడి చదివి మరిన్ని విజయాల సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు “.
ఇంకా ఈ కార్యక్రమంలో ఆస్క్ ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు గారు, అమరబోయిన వెంకటరత్నం గారు చేకూరి రమేష్ గారు కోర్స్ కో-ఆర్డినేటర్ :గంధం బుచ్చా రావు గారు ,చెరుకుపల్లి కిరణ్ గారు, కే. శ్రీకాంత్ గారు గంధం పండరి బాబు గారు పాల్గొన్నారు.

Aask student got state level rank