Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Aicc meeting Dy CM battivikramaarka : తుక్కుగూడ లో తుక్కురెపుతం

--కాంగ్రెస్ జన గర్జన సభ లో కదం తొక్కుతాం --కాంగ్రెస్ పార్టీ తడాఖా ఏంటో చూపిస్తాo --తుక్కుగూడ సభ లోనే దేశానికి దిశా నిర్దేశం --దేశంలోనే ఈ సభ చారిత్రాత్మకంగా నిలుపుతాం  --లోక్ సభ మేనిఫెస్టోను అక్కడనే ఏఐసీసీ ఆవిష్కృతం

తుక్కుగూడ లో తుక్కురెపుతం

–కాంగ్రెస్ జన గర్జన సభ లో కదం తొక్కుతాం
–కాంగ్రెస్ పార్టీ తడాఖా ఏంటో చూపిస్తాo
–తుక్కుగూడ సభ లోనే దేశానికి దిశా నిర్దేశం
–దేశంలోనే ఈ సభ చారిత్రాత్మకంగా నిలుపుతాం 
–లోక్ సభ మేనిఫెస్టోను అక్కడనే ఏఐసీసీ ఆవిష్కృతం

ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకైక దిక్కు కాంగ్రెస్ మాత్రమేనని తెలంగాణ రాష్ర్ట ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మన అంద రిదీ స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతికే ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుం దని హామీ ఇచ్చారు. అవాస్తవాలు మాట్లాడే బీఆర్ఎస్ ప్రతి పక్షంగా కూడా పనికిరాదని వ్యాఖ్యానించారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నాయకులు గత పాపాలకు బాధ్యత లేదంటే ఎలా దేశ భద్రతకు వా డాల్సిన కమ్యూనికేషన్ వ్యవస్థను గత పాలకులు వ్యక్తిగత అవసరా లకు వినియోగించారని ప్రశ్నించారు.

దేశ భద్రతకు ప్రమాదం తెచ్చార ని వ్యక్తిగత కుటుంబ జీవితాలు, వ్యాపారాలు, అధికారులు, జడ్జీలు ఏం మాట్లాడుకుంటున్నారో నిబం ధనలకు విరుద్ధంగా తెలుసుకున్నా రని జరిగిన నష్టానికి పద్ధతి ప్ర కారం చర్యలు తీసుకుంటా మని స్పష్టం చేశారు.తుక్కుగూడకాంగ్రెస్ జన గర్జన సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడారు.

జూన్ మాసంలో వచ్చిన వర్షాలను కేసీ ఆర్ ఒడిసి పట్టలేదని, అవ సరం లేకున్నా గొప్పల కోసం నాగార్జున సాగర్ నీటిని కిందికి వదిలా రని, నిర్మాణ లోపంతో కాలేశ్వరం లో గోదావరి నీటిని కిందికి వదల వలసి వచ్చి కెసిఆర్ తప్పిదాల వల్ల రాష్ట్రం ఇబ్బంది పడుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి,సంకల్పబలంతో ఇచ్చిన హామీలు అమలు చేస్తుందో తెలంగాణ మోడల్ గా తుక్కు గూడ లో ఏఐసీసీ నాయకత్వం సందేశం ఇవ్వబోతోందని, ఇది గర్వ కారణంగా భావిస్తున్నామని వివరించారు.

తుక్కుగూడ సభ నుంచే ఎఐ సిసి అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహు ల్, ప్రియాంక గాంధీ లు ఇచ్చిన 6 గ్యారంటీలను దేశమే ఆశ్చర్యపో యేలా అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. హామీల అమలులో ఒక్కరోజు ఆలస్యమైన ఆలస్యమే అని భావించి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తె చ్చామని, నిరుపేదల ఆరోగ్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షల పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

కెసి ఆర్ మాదిరిగానే హామీలు అమలు చేయకుండా దిగిపోతారని అనుకున్నారని, ఎవరి ఊహకు అందని విధంగా అడగకముందే రూ. 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యు త్తు భారతదేశం చరిత్రలో ఎక్కడా లేనివిధంగా అమలు చేశామని తెలిపారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దశాబ్దకా లం పాటు కాల్పనిక కథలు చెప్పిందని, వీళ్లు కూడా అలాగే ఉంటార ని అనుకో కుండా భద్రాచల సీతారామచంద్ర స్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీనర సింహస్వామి సన్నిధిలో పూజ చేసి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు ప్రకటించామని అన్నారు.

ఒక అడుగు ముందుకు వేసి ఊహలకు అందని విధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో డ్వాక్రా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాల ను అందించాలని నిర్ణయించామని, అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7 నుంచి మొద లు హైదరాబాద్ సభ వరకు డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణం మొత్తం లెక్కగట్టి చెక్కు రూపంలో అందజేశామని, అంగ న్వాడి, ఆశ, మధ్యాహ్న భోజన వర్కర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తు న్నామని వివరించారు.

ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి కేవలం మూ డు నెలల్లోనే 64.75 లక్షల మంది రైతులకు రైతుబంధు మొత్తాన్ని వారి ఖాతాల్లో నమో దు చేశామని, మీలాగా 8 నెలలు తీసుకోలేదని లెక్కలు చెబితే బీ ఆర్ఎస్ నేతలు నోరు మూసుకున్నారని, రైతు బీమా కింద పదిహేను వందల కోట్ల ప్రీమియం ప్రభుత్వమే చెల్లించిం దని, ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు అందజేస్తున్నామని వెల్లడిం చారు.
మూసీ నదిని పునర్జీవింపజేసి లండన్ లోని థేమ్స నదిని మరిపించే ప్రణాళికను సిద్ధం చేశా మని, హైదరాబాద్ మెట్రో విస్తరణ చేపట్టా మని, ధరణి వ్యవస్థను సర్వనాశనం చేసి రైతులను ఇబ్బంది పెడితే సమస్యలకు పరిష్కారాలు చూపిస్తున్నామని తెలిపారు. ఫామ్ హౌస్ లో మూడు నెలలు పడుకొని బయటికి వచ్చి కరెంటు లేదంటూ మా ట్లా డుతు న్నారని, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కు పనికిరాని సబ్ క్రిటికల్ టెక్నాలజీ ని వాడారని, యాదాద్రి థర్మల్ పవ ర్ స్టేషన్ ను బోగ్గు రవాణా ప్రాంతం నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడంతో తీవ్ర ఆర్థిక భారం పడుతుందని, డిస్కమ్ లు, జెన్కోలు మీ పాలనలో కుప్పకూలి పోయాయని విమర్శించారు.

కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థను సరిచేసి క్షణం కూడా కరెంటు పో కుండా చూస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అం దజేస్తున్నామని, 2030-31 వరకు పిక్ డిమాండ్ ను అందుకు నేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. 30 వేల ఉద్యో గాలు మూడు నెలల్లో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశామని, అదనపు పోస్టు లు కలిపి గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేశామ ని తెలిపారు.

హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యమని, హైదరాబాదులో డ్రగ్స్ మాట వినిపిస్తే తాటతీస్తామని హెచ్చరిస్తూ హైదరాబాద్ లో ఉన్న బిడ్డలు నిశ్చింతగా ఉండేలా కాంగ్రెస్ ప్రభు త్వం బాధ్యత తీసుకుంటుం దని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వరంగల్ నుంచి మహబూబ్నగర్ వరకు తుక్కుగూడ సభకు కదలి రావా లని, ప్రజాస్వామ్యం, హక్కుల పరిరక్షణ అంటే ఏమిటో ఈ దేశానికి జన గర్జన సభ ద్వారా చాటాలని పిలుపునిచ్చారు.