ఐటిఐ లో అడ్మిషన్లకు దరఖాస్తులు
విద్యా సంవత్సరం 2024 - 25 కు సంబంధించి ఐటిఐ లలో అడ్మిషన్ ల కోసం నోటిఫికేషన్ జారీచేసినట్లు నల్గొండ జిల్లా ఐటిఐ ల కన్వీనర్, ప్రిన్సిపాల్ ఎం. గోపాల్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజా దీవెన నల్గొండ టౌన్: విద్యా సంవత్సరం 2024 – 25 కు సంబంధించి (ITI) ఐటిఐ లలో(admissions ) అడ్మిషన్ ల కోసం నోటిఫికేషన్(Notification) జారీచేసినట్లు నల్గొండ జిల్లా ఐటిఐ ల కన్వీనర్, ప్రిన్సిపాల్ ఎం. గోపాల్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ (నాలుగు) ప్రైవేట్ (పది) ఐటిఐ లలో 2024-25, 26 సంవత్సరం (ఒకటి, రెండు సంవత్సరాల కోర్సులకు) అడ్మిషను కొరకు మొదటి విడత దరఖాస్తుల ను మే 16 నుండి జూన్ 10 వరకు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్ లను పదవ తరగతి మేమో , కుల దృవీకరణ, బోనఫైడ్, స్టడీ కండక్ట్ ( కనీసం 1 నుండి 7 తరగతుల వరకు) ఆన్లైన్ లో ఫోటోతో సహా స్కాన్ చేసి అవ్ లోడ్ చేయాలని పేర్కొన్నారు.
ఇందుకు గాను 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు iti.telangana.gov.in అనే వెబ్సైటు నందు, మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకొవాలని తెలిపారు. తెలంగాణ లోని ఏ ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐ లలో ఒకే ఒక్క రిజిస్టే షన్ తో అప్లై చేసుకొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Applications for admissions in ITI