Bad bus : ఘోర బస్సు ప్రమాదo
మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో డంపర్ ను ఢీకొన్న బస్సు --ప్రమాదంలో 12మంది మృతి, 14మందికి తీవ్ర గాయాలు --ప్రమాదంపై కొనసాగుతోన్న ప్రభుత్వ విచారణ
ఘోర బస్సు ప్రమాదo
—మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో డంపర్ ను ఢీకొన్న బస్సు
–ప్రమాదంలో 12మంది మృతి, 14మందికి తీవ్ర గాయాలు
–ప్రమాదంపై కొనసాగుతోన్న ప్రభుత్వ విచారణ
ప్రజా దీవెన/మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదo చోటుచేసుకుంది. బుధవారం రాత్రి డంపర్ను బస్సు ఢీకొనడంతో కనీసం 12 మంది మృతి చెందగా మరో 14 మందికి తీవ్రoగా గాయాలయ్యాయి.గాయపడిన వారిని చికిత్స కోసం గుణ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు.
ప్రమాదానికి గురైన బస్సు ఆరోన్కు వెళుతుండగా డంపర్ గుణ వైపు ప్రయాణిస్తుండగా రాత్రి 9 గంటల సమయంలోఈ ప్రమాదం జరిగిం దని పోలీసులు తెలిపారు. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగినప్పు డు బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో నలుగురు ఎలాగోలా బస్సులోంచి బయటకు వచ్చి ఇంటికి తిరిగి వెళ్లారని ఎస్పీ తెలిపారు.
ఈ ఘటనపై పరిపాలన విచారణ జరుపు తోందని గుణ కలెక్టర్ తరుణ్ రాఠీ తెలిపారు. ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ ముఖ్య మంత్రి మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేస్తూ మృ తుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంపై విచారణకు కూడా ఆదేశించా రు.
ఈ సందర్బంగా గుణా నుంచి ఆరోన్కు వెళ్తున్న బస్సులో భారీ అగ్నిప్రమాదం జరగడంతో ప్రయాణికులు మరణించారనే వార్త చాలా బాధాకరం. హృదయ విదారకమైన ఈ ప్రమాదంలో అకాల మరణం చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తోంది.
గాయపడిన ప్రయాణికులకు సరైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేలా, ప్రమాదంపై విచారణ జరపాలని నేను పరిపాలనా యంత్రాంగాన్ని ఆదేశించానని పేర్కోన్నారు.
జ్యోతిరాదిత్య సింధియా ఈ ఘటనను బాధాకరమని అభివర్ణిస్తూ, ‘సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి సహాయక చర్యలు ప్రారంభించాలని ఆదేశించానని అన్నారు.