బిఆర్ఎస్ వి ఆధ్వర్యంలో ఘనంగా బీపీ మండల్ వర్ధంతి
భారతదేశంలో ఓబీసీ రిజర్వేషన్ పితామహుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత బీపి మండల్ గారి వర్ధంతి
భారతదేశంలో ఓబీసీ రిజర్వేషన్ పితామహుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత బీపి మండల్ గారి వర్ధంతి సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో (జడ్పీ గెస్ట్ హౌస్ ఆవరణంలో) బిపి మండల్ విగ్రహానికి బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్, బి ఆర్ ఎస్ వి రాష్ట్ర కార్యదర్శి చెల్లా కోటేష్ యాదవ్ గార్లు కలిసి ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బొమ్మనపల్లి నాగార్జున మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ కొరకు దేశం మొత్తం తిరిగి 40 సిఫారసులను అందజేస్తే అప్పటి కేంద్ర ప్రభుత్వం కేవలం ఒకటి, రెండు మాత్రమే అమలు చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బి సి కుల గణన చేపట్టి బీ పి మండల గారి మిగిలిన సిఫారసులు కూడా అమలు చేసి చట్టసభల్లో బి సి లకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇసురాజు సైదులు, ఇసురాజు కోటేష్, తెలుసూరి శంకర్ యాదవ్, భైరబోయిన వేణు, సండ్ర కార్తీక్, ఖమ్మంపాటి తరుణ్, లింగస్వామి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.