Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bjp BRS congress minister komatireddy venkatreddy : బిజెపి, బిఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం

--కేసుల నుంచి తప్పించుకునేందుకే మిలాఖత్ --ఒప్పందంలో భాగంగానే కెసిఆర్ ఢిల్లీ టూర్ --ఇదే విషయాన్ని ఓ బిజెపి ముఖ్య నేత నాతో చెప్పాడు --మీడియా సమావేశంలో రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

బిజెపి, బిఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం

–కేసుల నుంచి తప్పించుకునేందుకే మిలాఖత్
–ఒప్పందంలో భాగంగానే కెసిఆర్ ఢిల్లీ టూర్
–ఇదే విషయాన్ని ఓ బిజెపి ముఖ్య నేత నాతో చెప్పాడు
–మీడియా సమావేశంలో రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ప్రజా దీవెన/ హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బి ఆర్ ఎస్), భారతీయ జనతా పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందం కుదుర్చు కొని ముందుకు సాగుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమా టోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( komatireddy venkat reddy) వ్యాఖ్యానించారు. బి ఆర్ ఎస్ ను వెంటాడు తున్న కేసుల నుండి తప్పించుకోవడానికే బీజేపీ తో లోపాయికారి ఒప్పందం కుదు ర్చుకుందని ఆరోపించారు.

లోపాయకారి ఒప్పందంలో భాగంగానే కేసీఆర్ ఢిల్లీ టూర్ కోసం వెళ్తున్నారని చెప్పారు. ఇదే విషయాన్ని ఢిల్లీలోని ఓ బీజేపీ నాయ కుడు నాకు చెప్పారని స్పష్టం చేశారు. శత్రువు దగ్గరికి వెళ్లి కేటీఆర్ (ktr) ని సీఎం గా ఆశీర్వదించండి అన్నారoటేనే దోస్తీ కుదిరినట్టు అని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ వాష్ అవుట్ అవు తుంద ని జోష్యం చెప్పారు.

బుధవారం హైదరాబాదులోని ఎమ్మెల్యే క్వార్టర్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు కె ఆర్ ఎం బి అంటేనే కేటీఆర్ అని హరీష్ రావు ( harish Rao) బహుశా తెలవకపోవచ్చని అన్నారు.మొదటి అసెంబ్లీ సమావేశాలలో కేసీఆర్ కు కేటాయించిన సీట్ లో కేటీఆర్ కూర్చున్నాడని, రెండో సెషన్ లో ఎందుకో కూర్చోలే దని, ఆ వెంటనే హరీష్ రావు ని ముందు పెట్టారనిచమత్కరించారు.

రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి నల్లగొండ జిల్లాలోని ఎస్ఎ ల్బీసీ టన్నేల్ ను పూర్తి చేయలేకపోయా రని,9 km టన్నెల్ ను బు ద్దున్నోడు ఎవడైనా సరే ఆ కొద్దిపాటి ఎస్ ఎల్ బి సి ని పూర్తి చేసే వాడని,వెలిగొం డలో జగన్ రెండు టన్నెల్ మూడేళ్ళలో పూర్తి చేశార ని గుర్తు చేశారు. నల్లగొండలో ఎస్ ఎల్ బి సి డి పూర్తి చేయనందుకు క్షమాపణ చెప్పి మాట్లాడాలని బుద్ధి లేకుండా మాట్లాడవద్దని హెచ్చ రించారు.

తెలంగాణలో ఏమో కానీ మెదక్ లోక్ సభ స్థానాన్ని గెలిచి చూపించా లని బి ఆర్ ఎస్ కు సవాల్ విసిరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ( kis han Reddy) గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదని, నమా మి గంగా కి రూ. 4 వేల కోట్లు పెట్టారని, మూసి కి ఎందుకు నిధులు ఇవ్వలేదని ద్వజమెత్తారు. భువనగిరి ఖిల్లా మీద రోప్ వే వేసుకుం దాం అని రూ. 200 కోట్లు అడిగితే కనీసం స్పందించలేదని, నాలు గెళ్ళ నుండి ఫైల్ దగ్గర పెట్టుకున్నాడని విమర్శoచారు.

సొంత రాష్ట్రానికి రూ. 200 కోట్లు తెచ్చుకోలేని కిషన్ రెడ్డి కాంగ్రెస్ మీద మాట్లాడటం సరికాదని, ప్రభుత్వం పడగొట్టడం గురించి అటు నుంచి కనీసం టచ్ చేసి చూడు మా తడాఖా ఏంటో చూపిస్తా మని హెచ్చరించారు. క్యాబినెట్ మంత్రిగా రూ. 200 కోట్లు ఇవ్వలేని నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి గడ్కరీ (gadgari) దగ్గర రూ. 3వేల కోట్ల పనులు తెచ్చుకున్నానని, అవసరం అయితే ప్రధానిని కలుస్తామని జాతీయ రహదారులను తీసుకొచ్చుకుంటా మని గుర్తు చేశారు.