Bjp, congress governments: ప్రభుత్వాలవి ప్రమాదకర ధోరణిలు
--నాటి ఉద్యమ స్ఫూర్తితో తాజాగా ఎండగడుతాము --ఈనెల 13వ తేదీన నల్లగొండలో భారీ బహిరంగ సభ --రైతు ప్రయోజనాలు పణంగా పెడుతున్న ప్రభుత్వాలు -- రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మిద్దాం --కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధుల సమావేశంలో బి ఆర్ ఎస్ అధినేత కేసిఆర్
ప్రభుత్వాలవి ప్రమాదకర ధోరణిలు
–నాటి ఉద్యమ స్ఫూర్తితో తాజాగా ఎండగడుతాము
–ఈనెల 13వ తేదీన నల్లగొండలో భారీ బహిరంగ సభ
–రైతు ప్రయోజనాలు పణంగా పెడుతున్న ప్రభుత్వాలు
— రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మిద్దాం
–కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధుల సమావేశంలో బి ఆర్ ఎస్ అధినేత కేసిఆర్
ప్రజా దీవెన, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరి
తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా ఉన్నాయని టిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ( kcr) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబి కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూనే కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడునేందుకు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
రైతాంగ ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేందుకు ఈనెల 13 వ తేదీన నల్లగొండలో భారీ బహిరంగ సభ ( A huge public meeting in Nalgonda on 13th of this month) నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ప్రజా ప్రతినిధులు పార్టీ ప్రముఖులతో ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు.
కృష్ణా నదీ జలాల పై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడుతామని స్పష్టం చేశారు. నాడు ఉద్యమం నడిపించి తెలంగాణ ను సాధించి తెలంగాణ హక్కులను కాపాడు కున్న స్ఫూర్తి తోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలది, తెలంగాణ ఉద్యమ కారులదేనని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేఆర్ఎంబి కి సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నదిమీద ప్రాజెక్టులను అప్పజెప్పి ( Projects on Krishna river including Sagar Srisailam were handed over to KRMB) కేంద్రం చేతికి మన జుట్టు అందించిందని, కాంగ్రేస్ ప్రభుత్వ తెలంగాణ jవ్యవసాయ రైతాంగ వ్యతిరేఖ నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తూన్నామని అన్నారు.
ప్రజా క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడుతామని బిఆర్ఎస్ అధినేత ప్రకటించారు. కృష్ణా నది పై ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబికి అప్పగించడం వల్ల రాష్ట్ర రైతాంగానికి తలెత్తే నష్టాలు, పర్యవసానాలు పై చర్చ కృష్ణా ప్రాజెక్టులు నదీ జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడుకునేం దుకు రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేఖ వైఖరిపై చేపట్టవలసిన తదుపరి కార్యాచరణ పై చర్చ నేపథ్యంలో తదననుగుణంగా అధినేత దిశా నిర్దేశం చేసారు.
తెలంగాణ ఉద్యమం లో తెలంగాణ సాగునీరు తాగునీటి హక్కుల కోసం పోరాడడమే కాకుండా “మా నీళ్లు మాకే “ అనే ప్రజా నినా దాన్ని స్వయంపాలన ప్రారంభమైన అనతికాలం లోనే నిజం చేసి చూయించిన ఘనత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కేఆర్ఎంబి పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణ కున్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కేంద్రం వత్తిళ్ళను తట్టుకుంటూ పదేండ్ల పాటు బిఆర్ఎస్ ( BRS ) ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి కాపాడిందన్నా రు.
కానీ కాంగ్రేస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యం తో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టలమీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేసారు. దీన్ని ప్రజా మద్దతు తో తిప్పికొడుతామన్నారు.తద్వారా హైదరాబాద్ రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు తాగునీరు అందక తిరిగి కరువుకోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచివున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రేస్ ప్రభుత్వ ప్రమాదకర మూర్ఖపు వైఖరి ని తిప్పికొట్టి కృష్ణా జలాలపై ప్రాజెక్టులపై తెలంగాణ కు రావలసిన వాటాను హక్కులను నూటికి నూరుశాతం కాపాడేందుకు ఎంతదాకనైనా పోరాడాల్సిందేన ని కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బిఆర్ఎస్ పార్టీ ఉన్నత స్థాయి సమా వేశం తీర్మానించింది.
ఈ సమావేశం లో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వా హక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, జి జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి,సబితా ఇంద్రా రెడ్డి, తలసాని, మల్లారెడ్డి, పువ్వాడ, సత్యవతి రాథోడ్ తో పాటు ఎమ్మెల్యే లు, ఎంఎల్సీలు, ఎంపీలు జడ్పీ చైర్మన్ లు, కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్లు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.