Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BJP is the bracelet for the development of the state: రాష్ట్రాభ్యున్నతికి బిజెపి కంకణం

-- అందుకు ప్రధానిగా నేనే స్వయంగా గ్యారెంటీ ఇస్తున్న -- తెలంగాణలో అన్ని వర్గాలు బిజెపిని ఆదరిస్తున్నాయి -- ఎన్నికల తర్వాత బిజెపి ప్రభుత్వo తప్పక వస్తుంది -- బిఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీలు ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు -- పాలమూరు సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

రాష్ట్రాభ్యున్నతికి బిజెపి కంకణం

— అందుకు ప్రధానిగా నేనే స్వయంగా గ్యారెంటీ ఇస్తున్న
— తెలంగాణలో అన్ని వర్గాలు బిజెపిని ఆదరిస్తున్నాయి
— ఎన్నికల తర్వాత బిజెపి ప్రభుత్వo తప్పక వస్తుంది
— బిఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీలు ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు
— పాలమూరు సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ప్రజా దీవెన/ పాలమూరు: ప్రజల ఉత్సాహం, ఉత్తేజం చూస్తుంటే రాష్ట్రంలో మార్పు ఖచ్చితంగా కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని (People want change in Telangana), రైతులు, మహిళలు, యువత బిజెపి ని ఆదరిస్తున్నారని, లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని బలపరిచారని స్పష్టంగా తెలియవచ్చిందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజలకు మోదీపై నమ్మకమే ఇందుకు తార్కానమని తెలిపారు. మోదీ గ్యారెంటీ ఇస్తే చేసి చూపిస్తారన్నది ప్రజల నమ్మకమని, అందుకు నేనే స్వయంగా తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతికి గ్యారెంటీ ఇస్తున్నానని అది చేసి చూపిస్తానని( I will do it and show that I am guaranteeing the development of Telangana state)  పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన బిజెపి ప్రజాగర్జన బహిరంగ సభలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

అవినీతి ప్రభుత్వం కాకుండా నిజాయితీ కలిగిన సర్కారు కావాలని, మోసపూరిత వాగ్దానాలు కాకుండా చెప్పింది చేసే ప్రభుత్వం కావాలని, అందుకు బీజేపీయే రావాలనే నిర్ణయానికి తెలంగాణ ప్రజలు వచ్చారని అది నూటికి నూరు శాతం నాకు తెలుసని చెప్పారు. 2014 వరకు తెలంగాణలో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే గడచిన తొమ్మిదేళ్ళలోనే తమ ప్రభుత్వం 2,500 కి.మీ. మేర నిర్మించిందని (In the last nine years, their government has built 2,500 km. It is built according to) వివరించారు.

ప్రతి చిన్న నగరం, గ్రామం నుంచి పట్టణం వరకు రహదారులు ఏర్పాటు చేస్తున్నామని తద్వారా రవాణా సౌకర్యం మెరుగైoదని తెలిపారు. బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ పార్టీలు ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు అని, కరప్షన్‌, కమీషన్‌ వాటి పాలసీ ( BRS and Majlis parties are private limited companies and corruption and commission is their policy) అని ప్రధాని మోదీ ఆరోపించారు. తెలంగాణలో అధికార పార్టీ స్టీరింగ్‌ మరొకరి చేతిలో ఉందని గుర్తు చేస్తున్న సర్కారును ఎవరు నడుపుతున్నారో అందరికీ తెలుసునంటూ ఎంఐఎం అధినేత ఒవైసీపై మోదీ పరోక్ష విమర్శలు గుప్పించారు.

రెండు కుటుంబ పార్టీలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, కరప్షన్‌, కమీషనే వాటి సిద్ధాంతమని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కుటుంబ వ్యవస్థగా మార్చివేశాయని, కుటుంబం కోసం పనిచేయడమే వాటి లక్ష్యమని ఆరోపించారు. పార్టీలను ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా మార్చివేశాయని, ఆ కంపెనీలకు అధ్యక్షుడు, సీఈవో, జనరల్‌ మేనేజర్‌ అందరూ కుటుంబ సభ్యులే ఉంటారని విమర్శించారు.

బీజేపీ మాత్రం సామాన్యుడి గురించి ఆలోచిస్తుందని స్పష్టం చేశారు. రైతుల కోసం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించామనని, పీఎం కిసాన్‌ యోజన కింద రూ.10 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని (Under the PM Kisan Yojana, Rs.10 thousand crores have been deposited in the accounts of farmers) చెప్పారు. తెలంగాణ హస్తకళలకు, నైపుణ్యాలకు నిలయమని ఇక్కడి ఉత్పత్తులకు ప్రపంచస్థాయిలో గుర్తింపు ఉందని గుర్తు చేశారు.

తెలంగాణలో పసుపు రైతుల అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తోందని (The central government is setting up a National Turmeric Board to recognize the need of turmeric farmers)  ప్రధాని మోదీ ప్రకటించారు. ఎగుమతులకు అనువైన సౌకర్యాలు కల్పిస్తామని, ఇక ములుగు జిల్లాలో జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఇందుకోసం రూ.900 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు.

ఆదివాసీల ఆరాధ్య దైవాలైౖన సమ్మక్క-సారక్క పేరిట ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడి ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీకి భూమి ఇవ్వడానికి ఐదేళ్లుగా జాప్యం చేస్తోందని (The government has been delaying for five years to give land to the tribal university) , ఆదివాసీల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని విమర్శించారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీని ‘యూనివర్శిటీ ఆఫ్‌ ఎమినెన్స్‌’గా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు.

దేశంలో 2014లో గ్యాస్‌ కనెక్షన్లు 14 కోట్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 32కోట్లకుపైగా ఉన్నాయని వివరించారు. గ్యాస్‌ పంపిణీ వ్యవస్థను విస్తరించాలని కేంద్రం నిర్ణయించిందని వెల్లడించారు. తాను ఇక్కడికి వచ్చే ముందు స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నానని, దేశ ప్రజలంతా ఒక గంట సమయం ఇందుకు కేటాయించాల్సిందిగా కోరానని తెలిపారు.

రాణి రుద్రమ వంటి వీర వనితలు ఏలిన గడ్డ తెలంగాణ అని మోదీ అన్నారు. మహిళా రిజర్వేషన్లతో ఇప్పుడు పార్లమెంటులోనే కాకుండా అసెంబ్లీల్లో కూడా మహిళల సంఖ్య మరింత (With the reservation for women, now the number of women is more not only in the Parliament but also in the Assemblies) పెరుగుతుందన్నారు. మహిళలు మోదీని బలపరిచారని, మోదీ వారికి సాధికారత కల్పించారని తెలిపారు. వారి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, వ్యక్తిగత మరుగుదొడ్లు, ముద్ర యోజన, పీఎం ఆవాస్‌ యోజన, గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు.