Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Parliament elections: బిజేపి భారీ మెజార్టీతో గెలుస్తుంది

పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ నుంచి బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని బిజెపి యువమోర్చా నల్గొండ పట్టణ అధ్యక్షుడు దుబ్బాక సాయి ధీమా వ్యక్తం చేశారు.

యువమొర్చా నల్లగొండ అధ్యక్షు డు దుబ్బాక సాయి
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ నుంచి బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని బిజెపి యువమోర్చా నల్గొండ పట్టణ అధ్యక్షుడు దుబ్బాక సాయి ధీమా వ్యక్తం చేశారు.యుమొర్చ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు దుబ్బాక సాయి ఆధ్వర్యంలో సోమవారం పట్టణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రధానమంత్రి మోదీ చరిష్మాతో 400 పార్లమెంటు స్థానాలు సాధించడం ఖాయమైందని తెలిపారు.

అందులో భాగంగా నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అత్యధికమైనటితో గెలుపొందడం కూడా నడికే అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికి ప్రచారం చేస్తూ బూతు స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ యువత ముందుండి నడిపించాలని కోరారు. ఢిల్లీలో నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు నల్లగొండలో శానం పూడి సైదిరెడ్డిని గెలిపించే దిశగా యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని కోరారు.

ఈ సమావేశంలో నల్గొండ బిజెపి పట్టణ అధ్యక్షులు కంకణాల నాగి రెడ్డి, ప్రధాన కార్యదర్శి గాలి శ్రీను, యువ మోర్చ పట్టణ ప్రధాన కార్యదర్శులు నాంపల్లి అయ్యప్ప, భరత్ ఉప్పు తల రాఘ, ఉపాధ్యక్షు లు గోపిరెడ్డి, వర్షిత్,లింగస్వామి కంకణాల సోమేశ్ రెడ్డి, కార్యదర్శు లు వంశీ, వేణుగోపాల్,కట్టకుంట్ల శ్రీను, అధికార ప్రతినిధి సాయికు మార్ తదితరులు పాల్గొన్నారు.

BJP won in Nalgonda parliament elections