BRSKCR: ప్రజా దీవెన, హన్మకొండ: తెలంగా ణ సమాజంలో అనేక మంది బలి దానాలు, త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆ తర్వాత అందరూ ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణను తీర్చిది ద్దుకున్నామని టిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలం గాణను 1956లో బలవంతంగా ఆంధ్రతో జవ హర్లార్ నెహ్రూ కలిపారని గుర్తు చేశారు.1969లో తెలంగాణ ఉ ద్యమం వస్తే కాంగ్రెస్ పార్టీ నిరంకుశంగా అణిచివేసిందన్నారు. తెలం గాణ రాష్ట్ర సమితి ఏర్పా టు తర్వాత మలిదశ ఉద్యమం ఉద్ధృత మైందని గుర్తు చేస్తూనే ఆనాడు కాంగ్రెస్, టీడీపీ నేతలు పదవు ల కోసం పెదవులు మూసుకున్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మం డిపడ్డారు. మన నడిగడ్డలో అ సెంబ్లీలో నిలబడి చంద్రబాబు నా యుడు తెలంగాణ పదాన్ని నిషేధిం చారని ఓ వైపు తెలియజేస్తూనే ఏ ది ఏమైనా నాడైనా, నేడైనా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాం గ్రెస్ అని కేసీఆర్ తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు.
హనుమకొండ జిల్లాలోని ఎల్కతు ర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆశేష జనరల్ మధ్య కేసీఆర్ ప్ర సంగించారు. కశ్మీర్లో ఉగ్రవాదులు మన దేశ ప్రజలపై దాడి చేశారని, వారికి నివాళులు అర్పిస్తున్నామ ని అన్నారు. ఉగ్రదాడిలో అమాయక ప్రజలు చనిపోయారని ఆవే దన వ్యక్తం చేశారు. అనంతరం బీఆ ర్ఎస్ రజోత్సవ సభకు తరలి వ చ్చిన వారందరికీ వందనాలు తె లుపుతున్నానన్నారు.కన్నతల్లిని, జన్మభూమిని మించిన స్వర్గం మ రొకటి ఉండదని కేసీఆర్ చెప్పా రు. వలసవాదుల వల్ల నలిగి పోతున్న తన భూమికి విముక్తి క ల్పిం చాలని భావించానని, తెలంగాణకు విముక్తి కలిగిచేందుకు ఒక్కడినే బయలుదేరానని తెలిపారు. అప్పట్లో తన గురించి కొందరు వెటకా రంగా మాట్లాడారన్నారు.
తాను ఒంటరిగా బయల్దేరి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించానని చెప్పారు. 25 ఏళ్ల క్రితం ఇదే గడ్డపై గులాబీ జెండాను ఎగురవే సిన ట్లు చెప్పారు. ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నమని, ప ది సంవత్సరాలు అందరూ అశ్చరపో యేలా తెలంగాణను పాలించి నట్లు ఆయన వెల్లడించారు.ఆనాడు కాంగ్రెస్, టీడీపీ నేతలు పద వు ల కోసం పెదవులు మూసు కున్నారని మన నడిగడ్డలో అసెం బ్లీలో నిలబడి చంద్రబాబు నాయు డు తెలంగాణ పదాన్ని నిషేధిం చా రని తెలిపారు. తాను మాత్రం పద వులను త్యాగం చేసినట్లు వెల్లడిం చా రు.
కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో ఫేయిల్ అయ్యిందని కేసీఆర్ అన్నారు. హామీల పేరుతో ప్రజలను మోసం చేశారని సర్కారుపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చి ఏ డాది దాటుతున్నా ఏం చేస్తున్నా ర ని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా రెండున్నరేళ్లు మాత్రమే సమ యం ఉందని, అంతకు ముందే వా రి మోసాలను బయట పె ట్టాలని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను మ ళ్ళీ అద్భుతంగా తీర్చిదిద్దు తాం. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన మాకు కాంగ్రెస్ సంగతి ఎంటో ప్రజ లే నిర్ణయిస్తారని అన్నారు.
పోలీసులపై కేసీఆర్ మండి పాటు…సభకు తరలి వస్తున్న బీఆర్ఎ స్ శ్రేణులను, ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డా రు కెసిఆర్. పోలీసులు ఎందుకు తొందర పడుతున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టి విస్టులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, పో లీసులు ఇవాళ డైరీలో రాసుకోవాలి మళ్లీ వచ్చేది బీఆర్ ఎస్సే ఇది ఆపడం ఎవరితరం కా దు, మా కార్యకర్తలను, నేతలను, ప్రజలను ఇబ్బంది పెట్టిన ప్రతి పో లీస్ లెక్క అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుస్తాం అంటూ గులాబీ బాస్ ఘాటుగా హెచ్చరించారు.
ఇక తాడోపేడో నేనే తేల్చుకుంటా.. ఇక నుంచి నేను బయ లుదేర తానని, ఎవరి లెక్కలు ఏం టో తీద్దాo కాంగ్రెస్ నయవంచక ప్రభు త్వం, కరెంట్ సరఫరా, రైతు బంధు, ధాన్యం కొనుగోళ్లలో, భూ ముల ధరలు పెంచడంలో ఫెయి ల్, అబద్ధపు వాగ్ధానాలు ఇష్టమొ చ్చినట్లు మాట్లాడటం, 20-30 శా తం కమీషన్లు తీసుకోవడమే కాం గ్రెస్ పని అని కేసీఆర్ ఘాటు వ్యా ఖ్యలు చేశారు గోల్మాల్ చేయడం లో, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ లేదు. ఇక్కడ ఉన్నోళ్ళు చాలరని, ఢిల్లీ నుండి డూప్లికేట్ గాంధీలు కూడా వచ్చి స్టే జీల మీద చప్పట్లు కొట్టి, డాన్సులు వేసి మరీ లేనిపోని హామీలు ఇచ్చా రు.
కాంగ్రెస్ నేతలు ఎన్నికలకు ముందు ఎన్నో చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చిన నకిలీ గాంధీలు ఎన్నో హా మీలిచ్చారు. మేము పింఛను రూ .2 వేలు ఇస్తే.. కాంగ్రెస్ వాళ్లు రూ.4 వేలు ఇస్తామన్నారు. ఇచ్చారా ?. మేము రైతు బంధు రూ.10 వేలు ఇస్తే.. వాళ్లు రూ.15 వేలు ఇస్తా మన్నారు. ఇచ్చారా, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా మని చెప్పారు. ఇచ్చారా, . రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. చేశారా, కల్యాణలక్ష్మీ స్కీమ్ తో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చారా, ఇప్పటికీ కూడా పించన్లు ఏ మాత్రం పెరగలేదు. రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదు. ఎన్నో హామీ లిచ్చి ప్రజలను తప్పుదారి పట్టించారు. ఉచిత బస్సులు పెట్టి మహి ళలు జుట్లు పట్టుకొనే పరిస్థితి తీసుకొచ్చారు. 2014 కు ముందున్న పరి స్థితులు మళ్లీ వచ్చాయంటూ కేసీ ఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమె త్తారు.
తన ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇది సాధ్యమా మన సభకు ప్రజలు రాకుండా అనే క ఆటంకాలు సృష్టిస్తున్నారు. బీఆర్ఎస్ సభల్ని ఆపుతారా, ఈ ప్రభం జనాన్ని ఎలా ఆపుతారు. కేసీఆర్ కిట్స్ ను ఎందుకు బంద్ చేశారు. ఎవరైనా వాటిని ఆపుతా రా ప్రభుత్వం నడపడం చేతకాక ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చా రు. వైఎస్సాఆర్ ఆరోగ్యశ్రీని తీసు కొచ్చారు. అది మంచి పథకమని నే ను కొనసాగించాను. ఆరోగ్య శ్రీ పథకం పేరు కూడా మార్చకుండా మే ము కొనసాగించామని కేసీఆర్ వెల్లడించారు.
కానీ, ప్రస్తుతం తెలంగాణలో అధి కారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ కిట్స్ ను ఎందుకు బంద్ చేశారు అని అడిగారు. ఎవ రైనా వాటిని ఆపుతారా పేదల కో సం తీసుకొచ్చి ఈ పథకాన్ని ఆప డం దారుణమని పేర్కొన్నారు. కాం గ్రెస్ కు ప్రభుత్వం నడపడం చేత కాక, రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు అం టూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆపరేషన్ కగార్ ను ఆపండి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మా వోయిస్టులను సమూలంగా ఏరి వేయడానికి చేపట్టిన ‘ఆపరేషన్ కగార్ తక్షణమే ఆపాలని బీఆర్ఎ స్ అధినేత కేసీఆర్ కేంద్రాన్ని డి మాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులను, అమాయకు లను ఊచకోత కోస్తున్నారని తెలి పారు.
ఎల్కతుర్తిలో నేడు జరిగిన బీఆ ర్ ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో కేసీఆర్ మాట్లాడుతూ అధికారం చేతిలో ఉందని ప్రాణాలు తీసుకుంటూ పో వడం కరెక్ట్ కాదని అన్నారు. మావో యిస్టులు శాంతి చర్చలకు వస్తామ ని అంటున్నారని, వెంటనే కూంబిం గ్, కాల్పులు ఆపి వారితో చర్చలకు ముందుకు రావాలని కేంద్రానికి సూ చించారు. ఆపరేషన్ కగార్ ఆపి, శాంతి చర్చలు జరపాలని కోరుతూ తమ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.
జనసంద్రంగా రజతోత్సవ సభా ప్రాంగణం.. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం జన సంద్రంగా మారింది. ఇసుకెస్తే రాల నంతగా జనం తరలివచ్చారు. స భా ప్రాంగణమంతా చీమల దండు లా తలపిస్తోంది. సభా ప్రాంగణాని కి దాదాపు నాలుగైదు కిలోమీటర్ల వరకు జనం బారులు తీరారు. ఇక సభా ప్రాంగణంలో కళాకారుల ఆట పాటలకు జనం ఉరకలేస్తూ ఉత్సా హంతో డ్యాన్స్లు చేస్తు న్నారు. తె లంగాణ పాటలతో గులాబీ సైనికు లు, ప్రజలు ఊగి పోతున్నారు.
గు లాబీ జెండాలను రెపరెపలాడిస్తూ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపు తున్నారు. ఇక ఎల్కతుర్తికి నలు వైపులా కిలోమీటర్ల మేర వాహ నాలు బారులు తీరాయి. జనాలు తమ వాహనాలను దిగి నడకదా రిన ఎల్కతుర్తికి తరలివస్తున్నారు. కేసీఆర్ ఎల్కతుర్తి సభా ప్రాంగణా నికి చేరుకోగానే జై కేసీఆర్, జై తె లంగాణ నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది.