Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Busireddy Foundation for the poor నిరుపేదలకు అండగా బుసిరెడ్డి ఫౌండేషన్

--బుసిరెడ్డి పౌండేషన్ చెర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి 

 

నిరుపేదలకు అండగా బుసిరెడ్డి ఫౌండేషన్

బుసిరెడ్డి పౌండేషన్ చెర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి 

ప్రజా దీవెన/ నాగార్జున సాగర్: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బుసిరెడ్డి పౌండేషన్ చెర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఆదివారం విస్తృతంగా పర్యటించారు. తిరుమలగిరి సాగర్ మండలంలోని నాగార్జున పేట, జామ్మనకోట తాండ, చింతలపాలెం గ్రామాల్లోనీ 12మంది నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. ఆయా గ్రామాల్లోని వారికి ఇంటికి వెళ్ళి మరీ ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా పాండురంగారెడ్డి  మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు ఈ సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మునుముందు కూడా పౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ  రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆయా కార్యక్రమాల్లో తిరుమలగిరి మండలం వైస్ ఎంపీపీ యడవల్లి దిలీప్ రెడ్డి, సర్పంచులు రమావత్ రవి నాయక్ , రామలింగయ్య యాదవ్, నెల్లికల్ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి, తిరుమలగిరి సర్పంచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, చింతపల్లి సర్పంచ్ ప్రభావతి సంజీవరెడ్డి,కొరివేని గూడెం సర్పంచ్ వెంకటరెడ్డి, నేతాపురం సర్పంచ్ వెoకటరెడ్డి, నాగార్జున పేట ఉపసర్పంచ్ ముని నాయక్,పెద్దవూర ఉప సర్పంచ్ ప్రదీప్ రెడ్డి, హజారిగూడెం ఉప సర్పంచ్ జలీల్ పాషా, చింతలపాలెం మాజీ యంపిపి నరసింహారావు, మాజీ కోఆపరిటివ్ క్రృష్ణారెడ్డి, బుసిరెడ్డి మట్టారెడ్డి, జయంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీరాంపల్లి యూత్ సభ్యులు VVS ప్రసాద్, కోటేష్, రమేష్ చారి, లింగస్వామి, లక్కీ ఫుడ్ కోర్ట్ భాస్కర్ రెడ్డి, శివానంద రెడ్డి, మల్లిఖార్జున చారి, బ్రహ్మం, రామకృష్ణ రెడ్డి, నితిన్,తేరా అఖిల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,పల్ రెడ్డి లక్ష్మారెడ్డి, అబ్దుల్ కరీం, వెంకటేశ్వర్లు యాదవ్, గంగయ్య, ముస్తాఫ, భవాని రెస్టారెంట్ సైదాచారి, ఫౌండేషన్ కో -ఆర్డినేటర్ మండలి లింగయ్య, మండల ఎక్జిక్యూటివ్ రవి తదుతరులు పాల్గొన్నారు.