Dsp Laxmi Naryana Nalgonda: వివాహేతర సబంధంతోనే హత్య
--ఇప్పలగూడెం హత్యకేసును ఛేదించిన పోలీసులు --ముగ్గురు నిందితుల అరెస్టు, రిమాండ్ కు తరలింపు --మీడియా సమావేశంలో డిఎస్పి లక్ష్మీనారాయణ వెల్లడి
వివాహేతర సబంధంతోనే హత్య
–ఇప్పలగూడెం హత్యకేసును ఛేదించిన పోలీసులు
–ముగ్గురు నిందితుల అరెస్టు, రిమాండ్ కు తరలింపు
–మీడియా సమావేశంలో డిఎస్పి లక్ష్మీనారాయణ వెల్లడి
ప్రజాదీవెన/నల్లగొండ: వివాహేతర సంబంధంతోనే నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామంలో ఓ వ్యక్తిని హత్యచేశారని డీఎస్పీ లక్ష్మీనారాయణ ( dsp laxminarayana ) వెల్లడించా రు. నల్లగొండ జిల్లా పోలీస్ కార్యా లయం లో గురువారం నిర్వహిం చిన మీడియా సమావేశంలో వంటల సైదులు హత్యకేసు వివరాల ను డీఎస్పీ వెల్లడించారు.
కేతేపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామానికి చెందిన వంట సైదులు కూలిపనిచేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మోదాల శ్రావణ్ కుమార్ కు చెందిన వ్యవసాయ భూమిలో పనికి వెళ్లేవాడు. ఈ క్రమంలో శ్రావణ్ కుమార్ భార్యతో సైదులు(35) చను వుగా ఉండేవాడు. దీంతో తన భార్యతో వివాహేతర సంబంధం కొన సాగిస్తున్నాడని అనుమానం కలిగి సైదులుపై కోపం పెంచుకు న్నాడు.
ఇదే విషయాన్ని సూర్యాపేట జిల్లా కుడకుడ గ్రామానికి చెందినసొంత భామ్మార్దులైన వెంకటేశ్ వివరించాడు. ఇద్ద రూ కలిసి సైదులు చం పాలనే ఆలోచన కలిగింది. ఇరువరూ కలిసి వెంకటేశ్ సొంత బాబా యి కుమారుడైన బండారి సాయికుమార్ సహాయం కోరారు. ముగ్గు రు కలిసి ఎలాచంపాలో ముందుగానే పక్కా ప్రణాళికవేసుకున్నారు.
తమ పథకంలో భాగంగా సైదులు చంపు టకు వ్యవసాయ పొలం వ ద్ద పొలం పనిముట్లకు వాడే ఇనపసుత్తి ని తమ బండిలో పెట్టుకు న్నారు.ఈ నెల 3వ తేదీ శనివారం రాత్రి సైదులు గ్రామంలోనే ఓ బెల్ట్ షాపులో మద్యం సేవిస్తుండగా, వెంకటేష్, సాయి ఇద్దరు అక్కడి కి వెళ్లారు. గ్రామశివారులో మద్యం సేవిద్దామని గ్రామశివారుకు ఐకేపీ సెంటర్ దగ్గరకు తీసుకువెళ్లారు.
శ్రవణ్ కుమార్ కూడా వారి దగ్గరకు చేరుకున్నారు. నలుగురూ కలిసి తమవెంట తెచ్చుకున్న మద్యాన్ని సేవించారు. శ్రావణ్ కుమార్ కలు గజేసుకుని తన భార్యతో ఎందుకు చనువుగా ఉంటున్నావని ప్రశ్నిం చారు. ఈ క్రమంలో మాటామాట పెరిగి గొడవ పెద్దదిగా మారింది. అప్పటికే తమ వెంట తెచ్చుకున్న సుత్తితో శ్రావణ్ కుమార్, వెంకటేష్ లు కలిసి సైదులును కొట్టడంతో చనిపాయాడు.
హత్య జరుగుతున్న క్రమంలో సాయికుమార్ ఎవరూ రాకుండా రోడ్డుపై కాపాలాగా ఉన్నాడు. కేతేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నెల 7న బుధవారం ముగ్గురు నిందితులను ఇప్పలగూడెంలో అరెస్టు చేశారు. హత్యకు ఉపయో గించిన సుత్తి, 2బైక్ లు, మూసు ముబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకు న్నారు. ఈ కేసును ఛేదించిన శాలిగౌరారం సీఐ రాఘవ కేతేపల్లి ఎస్ఐ శివతేజ, సిబ్బంది మహేష్, అజిత్ రెడ్డిని డీఎస్పీ అభినందిం చారు.