Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Parliament Elections: ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై కేసులు

ఇప్పటివరకు పోలింగ్ విధులకు రిపోర్ట్ చేయని పిఓ,ఏపిఓ, ఇతర పోలింగ్ సిబ్బందిపై కేసులకు ఉప క్రమించినట్లు జిల్లా కలెక్టర్ హరి చందనదాసరి తెలిపారు.

నల్లగొండ జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్ని కల అధికారి దాసరి హరిచందన
ప్రజాప్రతినిధ్య చట్టం 1951 కింద కేసుల నమోదుకు ఆదేశం

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:  ఇప్పటివరకు పోలింగ్(Polling duty ) విధులకు రిపోర్ట్ చేయని పిఓ,ఏపిఓ, ఇతర పోలింగ్ సిబ్బందిపై కేసులకు ఉప క్రమించినట్లు జిల్లా కలెక్టర్ హరి చందనదాసరి తెలిపారు. ఈ మేర కు ఆమె నల్లగొండ లోని ఎన్నికల(Elections) సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద మీడి యాతో మాట్లాడుతూ చెప్పా రు. ఎన్నికల విధులకు(election duty) రిపోర్ట్ చేయని వారు తక్షణమే రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అందరు అసిస్టెంట్ రిట ర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నాగార్జునసాగర్, మును గోడు, నకిరేకల్ అసెంబ్లీ నియో జక వర్గాల పరిధిలో సిబ్బంది గైర్హాజరై నట్లు గుర్తిoచినట్లు తెలిపారు. విధులకు గైర్హాజరైనవారు తక్షణమే అధికారుల వద్ద రిపోర్టు చేయాలని సూచించారు.

Cases against absent from election duty