Revanth reddy meets CPM: సీఎంతో సీపీఎం నేతల భేటీ
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రక్రియలో రాజకీయ సమీకరణాలు చకచకా మారిపోతున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఎంపీ ఎన్నికల్లో మద్దతు విషయం లో చర్చలు
తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుండి తప్పుకున్న సీపీఎం
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల(Lok sabha elections) ప్రక్రియలో రాజకీయ సమీకరణాలు చకచకా మారిపోతున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ముక్కోణపు హోరాహోరీ పోటీ నెలకొన్న ఈ నేఫథ్యంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డితో(Revanth reddy) సీపీఎం నేతలు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. శనివారం సీఎం నివాసం లో ముఖ్యమంత్రి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్య తదితరు లు భేటీ అయ్యారు.
ఎంపీ ఎన్నిక ల్లో మద్దతు విషయంలో వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అ యితే సీపీఎం పార్టీ భువనగిరి ఎం పీ బరిలో అభ్యర్థిని నిలిపిన నేప ద్యంలో సీపీఎం అభ్యర్థిని పోటీ నుండి తప్పించాలని కాంగ్రెస్(Congress) అభ్య ర్థించగా సిపిఎం సమ్మతిస్తూనే తమ అధిష్ఠానంతో చర్చించి నిర్ణ యం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది.సాయంత్రం తమ నిర్ణ యాన్ని ప్రకటిస్తామని సీపీఎం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపు కోసం కృషి చేస్తామని సీపీఎం నేతలు ప్రకటించ డంతో పాటు ఫాసిస్ట్ బీజేపీని(BJP) అడ్డు కునేందుకు కాంగ్రెస్ తో కలిసి నడుస్తామన్న సీపీఎం నేతలు వెల్లడించారు.
CM Revanth reddy meets CPM Leaders