CM RevanthReddy review ACB గొర్రెలు, చేపల పంపిణీ పై సమగ్ర విచారణ
విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్మెంట్ కు బాధ్యతలు అప్పగింత --ప్రాధమిక నివేదిక ఆధారంగా ఏసీబీకి ఇవ్వాలని ఆదేశాలు --ఏప్రిల్ నుంచి పాడి రైతులకు ప్రోత్సాహకం చెల్లింపు --వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామకాలకు వెయిటేజీ --పశు సంవర్థక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి
గొర్రెలు, చేపల పంపిణీ పై
సమగ్ర విచారణ
—విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్మెంట్ కు బాధ్యతలు అప్పగింత
–ప్రాధమిక నివేదిక ఆధారంగా ఏసీబీకి ఇవ్వాలని ఆదేశాలు
–ఏప్రిల్ నుంచి పాడి రైతులకు ప్రోత్సాహకం చెల్లింపు
–వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామకాలకు వెయిటేజీ
–పశు సంవర్థక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన/ హైదరాబాద్: గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో జరి గిన లావాదేవీలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి ( CM RevanthReddy) ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాలు ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటివరకు లబ్ధిదారుల ఎంపిక మొద లు గొర్రెల కొనుగోలు, పంపిణీ జరిగిన తీరుపై అన్ని కోణాల్లో దర్యా ప్తు చేయాలని చెప్పారు. విజిలె న్స్ ఇచ్చే ప్రాథమిక నివేదికలో ఏమైనా అవినీతి, అవకతవకలను గుర్తిస్తే వెంటనే ఈ వివరాలను ఏసీబీ ( acb )కి అప్పగించాలని సీఎం అధికారులకు సూచించారు.
మంగళవారం సచివాలయంలో పశు సంవర్ధక శాఖ, పాడి అభివృ ద్ధి, మత్స్య శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. గొర్రెల ( goats) పథకంలో జరిగిన అవ కతవకలు, ఇటీవల ఈ పథకంలో జరిగిన భారీ అవినీతిని కాగ్ త మ నివేదికలో వేలెత్తి చూపిన విషయా న్ని ఈ సమావేశంలో ముఖ్య మంత్రి ప్రస్తావించారు. ఇటీవల గొర్రెల పం పిణీకి సంబంధించినని ధులను బినామీ పేర్లతో కొందరు ఉద్యోగులు సొంత ఖాతాలకు మ ళ్లిం చుకున్న కే సులో ఏసీబీ దర్యాప్తు గుర్తు చేస్తూ అoదులో శాఖా పరంగా వివరాలేమీ సేకరించలేదా అని ఆరా తీశారు.
2017లో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకంలో మొదటి విడతకు రూ. 3955 కోట్ల రుణం ఇచ్చిన చేసిన నేషనల్ కో ఆపరే టివ్ డెవెల ప్మెంట్ కార్పొరేషన్ రెండో విడతకు ఎందుకు రుణం ( loans) ఇవ్వ టం నిలిపి వేసిందని ముఖ్యమంత్రి అధి కారులను ప్రశ్నించారు. అ ప్ప టికేఈ పథకంపై కాగ్ వివిధ అభ్యంతరాలు లేవనెత్తడం, అవకత వకలను గుర్తిం చిందని, తదితర కారణాలతో ఎ న్సీడీసీ రుణం ఇవ్వ లేదని అధికా రులు సమాధాన మిచ్చారు. ఇప్ప టికే తమ వాటా కింద 25 శాతం డీడీలు చెల్లించిన అందజేసిన లబ్ధిదారులకు ఎందు కు గొర్రెలను పంపిణీ చేయలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
రెండో విడతలో 85488 మంది ఇప్పటికే తమ వాటా కింద 25 శాతం డబ్బు చెల్లించారని, దాదాపు రూ. 430 కోట్లు జిల్లా కలెక్టర్ ల ఖాతాల్లోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 2,20,792 మంది లబ్ధిదారు లు ఇంకా డబ్బులు కట్టలేదని చె ప్పారు. ఈ పథ కం అమలు జరిగిన తీరుపై రకరకాల అనుమానాలు న్నాయని, దీం తో పాటు చేపల పెంపకానికి సంబంధించి ఎక్కువ సంఖ్యలో ఫిర్యా దులు వస్తున్నాయ ని ముఖ్యమంత్రి అన్నారు. ఈ వ్య వహారంపై సమగ్రంగా విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
పాడి రైతు లకు ప్రభుత్వం ఇచ్చే ఒక్కో లీటర్పై ఇచ్చే రూ.4 ప్రోత్సా హకం మూడేం డ్లుగా ఇవ్వటం లేదని అధికారులు సీఎం దృష్టికి తీ సుకు వచ్చారు. దా దాపు రూ.203 కోట్ల బకాయిలు పేరుకుపో యా యని చెప్పారు. స్పందించిన ముఖ్యమంత్రి ఏప్రిల్ నుంచి పాడి రైతు లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహాకాన్ని క్రమం తప్పకుండా విడుదల చేయా లని అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు జరిగేలా చూడా లని చెప్పారు.
ప్రతి మండలంలో వెటర్నరీ హాస్పిటల్ తప్పకుండా ఉండాలని, 91 కొత్త మండలాల్లో నూ అవసరమైన ఏర్పాట్లు చేయా లని ముఖ్య మంత్రి సూచించారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్ సేవలను కొనసాగించా లని, అందుకు అవసరమైన టెండర్లను వెంటనే పిలవాలని చెప్పా రు. వివిధ పథకా ల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని అ న్నారు.
టీఎస్పీఎస్సీ చేపట్టిన వెటర్నరీ (vetarnory) సర్జన్ పోస్టుల ని యామకాల్లో ఈ విబాగంలో ఏళ్లకేళ్లుగా పని చేస్తు న్న వారికి వెయి టేజీ ఇ వ్వాలనే ప్రతిపాదనను పరిశీలించాలని, వైద్యారోగ్య శాఖలో అమ లైన వెయిటేజీ విధానాన్నిఈ విభాగంలో నూ వర్తించేలా చూ డాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ సమావేశం లో ముఖ్య మంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యద ర్శి స్పెషల్ సీఎస్ ఆధర్ సిన్హా, డెయిరీ డైరెక్టర్ లక్ష్మి, ఫిషరీస్ డైరెక్టర్ గోపి పాల్గొ న్నారు.