Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM RevanthReddy union government : కేంద్రంలో ఎవరున్నా సహకారం కోరతాం

--సహకరించకపోతే ప్రజలిచ్చిన శక్తితో కడదాకా కొట్లాడుతాo --ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి అభివృద్ధిని కుంటుపరుస్తుంది --రాజీవ్‌ రహదారి ఎలివేటెడ్‌ కారిడార్‌కు భూమి పూజ కార్యక్రమం లో సీఎం రేవంత్ రెడ్డి

కేంద్రంలో ఎవరున్నా సహకారం కోరతాం

–సహకరించకపోతే ప్రజలిచ్చిన శక్తితో కడదాకా కొట్లాడుతాo
–ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి అభివృద్ధిని కుంటుపరుస్తుంది
–రాజీవ్‌ రహదారి ఎలివేటెడ్‌ కారిడార్‌కు భూమి పూజ కార్యక్రమం లో సీఎం రేవంత్ రెడ్డి

ప్రజా దీవెన/ హైదరాబాద్: కేంద్రంలో ఎవరున్నా తెలంగాణ అభివృ ద్ధి కోసం సహకరించాలని అడుగుతూనే ఉంటామని, సహక రించక పోతే ప్రజలిచ్చిన శక్తితో కొట్లాడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM RevanthReddy) చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి అభివృద్ధిని కుంటుపరుస్తుందని అన్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలకమైన రాజీవ్‌ రహదారి ఎలివేటెడ్‌ కారిడార్‌కు ముఖ్యమంత్రి గురువారం భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ ( elivated coridor ) మేడ్చల్, కుత్బుల్లాపూర్ అభివృద్ధి చెందడమే కాకుండా, కరీంనగర్, ఆదిలాబా ద్ ప్రయాణం సులభతరం అవుతుందన్నారు.గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని, ప్రజల అవసరాలను విస్మరిం చిందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరిం చామని తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిసి ప్రాజెక్టు అవస రాన్ని వివరించామని తెలియజేశారు. ఈ కారిడార్‌ కోసం స్థానిక లోక్‌ సభ సభ్యుడిగా అనేకసార్లు కేంద్రాన్ని కో రాననీ, కంటోన్మెంట్‌ బోర్డు సమావేశాల్లో కూడా లేవనెత్తానని గుర్తు చేశారు. ఈప్రాజెక్టు కోసం రక్ష ణ శాఖకు కేటాయించాల్సిన భూముల ను కేటాయించలేదని, అలాగే చాంద్రాయగుట్ట రక్షణ శాఖ  భూముల ( defence department lands) లీజును రెన్యువల్‌ చేయ కుండా గత ప్రభుత్వం జాప్యం చేసిన విషయాన్నీ ముఖ్య మంత్రి వివరించారు.

అధికారంలోకి రాగానే అధికారులతో సమీక్షించి రక్షణ శాఖకు భూ ములు అప్పగించామన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించ డంతో రాష్ట్రానికి కేంద్రం సహకరించిందనీ, పదేళ్ల బీఆర్‌ఎస్‌ విధా నాల తో ప్రజలకు శిక్ష పడిందని వివరించారు. ఉత్తర తెలంగాణ అ భివృద్ధి చెందాలంటే ఎలివేటేడ్ కారిడార్ పూర్తవ్వాలని, ప్రజల అవస రాల కోసమే ఒక మెట్టుదిగామని, రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు. ఎన్నికలొ చ్చినప్పుడే రాజకీయాలు. తర్వాత అభివృద్ధే మా విధానం” అని అన్నారు.

ఓఆర్‌ఆర్‌ నిర్మాణం, అంతర్జాతీయ విమానాశ్రయం, హైటె క్‌ సిటీ వంటి అనేక ప్రాజెక్టులు పూర్తి చేసి హైదరాబాద్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని గుర్తుచేశారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అంతకు ముందు సీఎం ప్యా రడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌ పేట వరకు 6 లేన్లతో 11.3 కిలోమీటర్ల పొడవున నిర్మించబో యే ఈ కారిడార్‌పై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శ నను తిలకించారు. ప్రాజెక్టుకు సంబంధిం చిన పలు వివ రాలను ముఖ్యమం త్రి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రు లు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రజాప్రతినిధులు ఉన్న తాధికా రులు పాల్గొన్నారు.‌