Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Polling: ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్ పూర్తి

పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో పోలింగ్ సిబ్బంది రాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ప్రజా దీవెన నల్గొండ:  పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో పోలింగ్ సిబ్బంది రాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి సమక్షంలో పోలింగ్ సిబ్బంది ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. పోలింగ్ సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయిస్తూ నిర్వహించిన రాండమైజేషన్ కార్యక్రమానికి నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన, సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు, నల్గొండ ఆర్డిఓ, ఏఆర్ఓ రవికుమార్, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు శ్రీనివాస్, సూర్యనారాయణ, వేణుమాధవ్, జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి గణపతి రావు తదితరులు హాజరయ్యారు.

Complete randomisation of election personnel