Telangana Formation day: తెలంగాణ అస్తిత్వంపై విషం చిమ్ము తున్నారు
తెలంగా ణకు గర్వకారణమైన అస్తిత్వ చి హ్నాలపై విషం కక్కుతూ అధికార ముద్ర నుంచి తొలగిస్తూ అవమాని స్తున్నారని బి ఆర్ ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు.
చింతతోనే రాలేకపోతున్నాను
ఆహ్వానించిన తీరు నోటితో మా ట్లాడుతూ నొసటితో వెక్కిరించిన ట్లుగా ఉంది
కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పోకడ లను బీఆర్ఎస్ నిరసిస్తోంది
తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉత్సవాల తీరును ఉద్యమకారులు నిరసిస్తున్నారు
సీఎం రేవంత్కు 22 పేజీల సుదీర్ఘ లేఖ రాసిన మాజీ సీఎం కేసీఆర్
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణకు గర్వకారణమైన అస్తిత్వ చి హ్నాలపై విషం కక్కుతూ అధికార ముద్ర నుంచి తొలగిస్తూ అవమాని స్తున్నారని బి ఆర్ ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ( Telangana Former Chief Minister KCR) మండిపడ్డారు. ఉత్సవాల వేదికపై తనకు స్థానం, ప్రసగించే అవకాశం కల్పించకపోవడం, నిర్వ హణపై అఖిలపక్ష సమావేశానికి బీ ఆర్ఎస్ను ఆహ్వానించకపోవడం కాంగ్రెస్(congress) ఆధిపత్య ధోరణి, అప్రజా స్వామిక వైఖరికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిర్వ హించే రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో తాను పాల్గొన లేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. తనను ఆహ్వానించిన తీరు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని ఆక్షేపిం చారు. తెలంగాణ ఇచ్చామనే ఆధిపత్య, అహంభావ ధోరణిని ప్రదర్శిస్తూ ఉద్యమాన్ని, అమరుల త్యాగాన్ని అవమానించే వైఖరిని మార్చుకోకుండా చేసే ఉత్సవాలకు సార్థకత ఏముందని ప్రశ్నించారు. తెలంగాణ దశాబ్ది వేడుకలకు(Telangana Decade Celebrations) ఆహ్వానం పంపిన నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డికి కేసీఆర్ 22 పేజీల సుదీర్ఘలేఖ రాశారు. ప్రజల తరఫున చింతతోనే లేఖ రాస్తున్నట్లు తెలి పారు.
సుదీర్ఘ ప్రజా పోరాటం, అమ రుల త్యాగాలతో కాకుండా కాంగ్రెస్ దయా బిక్షతో తెలంగాణ వచ్చిం దన్న భావ దారిద్య్రాన్ని నిరసి స్తున్నట్లు పేర్కొన్నారు.ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే వ్యర్థ ప్రయత్నాలు. కాకతీయులు, కుతుబ్షాహీల కాలంలో నిర్మించిన వాటికీ మలినా న్ని ఆపాదిస్తూ ప్రజల మనోభావాల ను దారుణంగా గాయపరుస్తున్న ప్రభుత్వ సంకుచిత ధోరణి హానికరమని, అవమానకరమని దుయ్యబట్టారు. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఉద్దేశించిన స్థలంలో కాంగ్రెస్ పెద్దల విగ్రహాలు పెట్టే ప్రయత్నం చేస్తూ రాష్ట్ర అస్తిత్వాన్ని అవమా నిస్తున్నారని, తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉత్సవాలు జరుగుతు న్న తీరును ఉద్యమకారులు నిరసి స్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం తిరోగమనం దిశగా వెళ్తున్న నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాల్లో నేను పాల్గొనడం సమం జసం కాదని బీఆర్ఎస్(BRS Party workers) శ్రేణులు, సహ ఉద్యమకారులు, తెలంగా ణవాదుల అభిప్రాయమని లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు. చరిత్ర పొడు గునా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రె స్ రక్తసిక్తం చేసిందనేది దాచేస్తేదాగ ని సత్యంగా పేర్కొన్నారు.
ముల్కీ ఉద్యమంలో సిటీ కాలేజీలో విద్యా ర్థులపై కాల్పులు జరిపి నలుగురిని పొట్టన పెట్టుకున్నదని, తొలిదశ ఉద్యమంలో 369 మంది యువకు లను కాల్చి చంపిందని కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. ఆ పార్టీ మోసాలతో వందల మంది యువకులు ప్రాణ త్యాగాలకు పాల్పడినపా ఏనాడూ పశ్చాత్తాపం ప్రకటించలేదని, అమ రుల స్థూపం ఆవిష్కరణకు అడ్డుప డి కర్కశంగా వ్యవహరించిందన్నా రు. ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి జరిగిన చారిత్రాత్మక ప్రయత్నమే టీఆర్ఎస్ ఆవిర్భావంగా వివరిం చారు.వక్రీకరణలు మాని చేసిన తప్పులకు గాను క్షమాపణ చెప్పా లని కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ డిమాం డ్ చేశారు. రేవంత్ సీఎం అయ్యాక జై తెలంగాణ అనలేదని, అమరవీ రుల స్థూపాన్ని సందర్శించలేదని ఆక్షేపించారు. ఆరు నెలల్లోనే ప్రజా జీవితం అస్తవ్యస్తమైందన్నారు. తాము అన్ని రంగాలకూ 24 గంట ల కరెంటు ఇస్తే కాంగ్రెస్ వచ్చాక అప్రకటిత కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. కృష్ణా ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పజెప్పారని, కృత్రి మ కరువును సృష్టించి, నీళ్లను సముద్రం పాల్జేశారని, మోదీ ప్రభు త్వం గోదావరి నీటినీ తరలించు కుపోయే ప్రణాళికలు వేస్తుంటే ప్రభుత్వం గుడ్లప్పగించి నిల్చుందని, రాజ కీయ ప్రయోజనాల కోసం చోద్యం చూస్తున్నదని వాఖ్యా నించారు.
వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని,అకాల వర్షా లతో పంటలు నష్టపోయిన ఒక్క రైతునూ సీఎం పరామర్శించలేదని విమర్శించారు. సకాలంలో రైతు బంధు ఇవ్వడంలో దారుణంగా విఫలమయ్యారని, డిసెంబరు 9లోగా రుణమాఫీ చెయ్యకపోవ డంతో అన్నదాతకు మార్గాలు మూసుకుపోయాయని, రైతు భరో సా కింద ఎకరాకు రూ.15 వేలు ఎప్పుడిస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయం తిరిగి సంక్షోభం వైపు పయనిస్తున్నదని, పచ్చి రొట్ట విత్త నాల కోసం రైతులు క్యూ కట్టాల్సిన అగత్యం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్ర పరిస్థితులు పునరావృతం ఖాయ మనే సంకేతాలు కనిపిస్తున్నాయ న్నారు. ఆటో కార్మికులను, రైతు కూలీలకు ఇచ్చిన హామీల సంగతే మిటని, మహాలక్ష్మి పథకం ఏమైంద ని ప్రశ్నించారు. వృద్ధులకు రూ.4 వేలు ఎప్పుడిస్తారని కేసీఆర్ నిలదీ శారు. జాబ్ క్యాలెండర్ (Job calender)ఏమైంద న్నారు.
ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రజలు ట్యాంకర్ల కోసం రూ.లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితిలోకి వెళ్లారని, డయాగ్నస్టిక్ కేంద్రాలు నిర్వీర్యమయ్యాని, కరెంటు కోతలతో అత్యవసర వైద్య సేవలకు విఘాతం కలుగుతోందని ఆరోపిం చారు. హైదరాబాద్లో టిమ్స్ ఆస్పత్రులు, వరంగల్ ఆస్పత్రి నిర్మాణం కుంటుపడుతోందన్నారు. ఆడపిల్ల పెళ్లికి ఇస్తామన్న తులం బంగారం ఏమైందో తెలియదు కానీ, కల్యాణ లక్ష్మి కింద రూ.లక్ష కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు రాకపోగా ఉన్న పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయన్నారు. ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను హత్య చేసే దుష్ట సంస్కృతిని కాంగ్రెస్ తీసుకొస్తోందని కేసీఆర్ విమర్శిం చారు. సోషల్ మీడియాలో(Social media) ప్రభు త్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడితే కేసులు పెట్టి వేధిస్తున్నారని మండి పడుతూ తన లేఖలో పేర్కొన్నారు.
Congress attack on Telangana symbols